Andhra Pradesh
అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై నటి మంచు లక్ష్మి ఆవేదన
అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటనపై ప్రముఖ నటి మంచు లక్ష్మి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటనలో ఒకేసారి వందల మంది ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమని ఆమె ఒక వీడియో సందేశం ద్వారా తెలిపారు.
మంచు లక్ష్మి తన వీడియోలో ఈ ఘటన గురించి మాట్లాడుతూ, ప్రమాదం జరిగిన రోజే తాను ముంబై నుంచి లండన్కు ప్రయాణించినట్లు వెల్లడించారు. దేవుడి దయ వల్ల తాను సురక్షితంగా లండన్లో ల్యాండ్ అయినట్లు చెప్పారు. అయితే, ల్యాండ్ అయిన వెంటనే ఈ విషాదకర ఘటన గురించి తెలిసిందని, ఆ సమయంలో తన మనసు కలిచివేసినట్లు ఆమె పేర్కొన్నారు.
ఈ దుర్ఘటన పట్ల తన సానుభూతిని వ్యక్తం చేస్తూ, బాధిత కుటుంబాలకు ఆమె తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు.