Andhra Pradesh

అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై నటి మంచు లక్ష్మి ఆవేదన

విమానం కూలిన రోజే.. ఎయిర్ ఇండియా ఫ్లైట్‌లో లండన్‌కు మంచు లక్ష్మి.. అభిమానుల  ఆందోళన

అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటనపై ప్రముఖ నటి మంచు లక్ష్మి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటనలో ఒకేసారి వందల మంది ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమని ఆమె ఒక వీడియో సందేశం ద్వారా తెలిపారు.

మంచు లక్ష్మి తన వీడియోలో ఈ ఘటన గురించి మాట్లాడుతూ, ప్రమాదం జరిగిన రోజే తాను ముంబై నుంచి లండన్కు ప్రయాణించినట్లు వెల్లడించారు. దేవుడి దయ వల్ల తాను సురక్షితంగా లండన్లో ల్యాండ్ అయినట్లు చెప్పారు. అయితే, ల్యాండ్ అయిన వెంటనే ఈ విషాదకర ఘటన గురించి తెలిసిందని, ఆ సమయంలో తన మనసు కలిచివేసినట్లు ఆమె పేర్కొన్నారు.

ఈ దుర్ఘటన పట్ల తన సానుభూతిని వ్యక్తం చేస్తూ, బాధిత కుటుంబాలకు ఆమె తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version