Education

ఇంటర్ విద్యార్థులకు హెచ్చరిక.. ఒక పరీక్షకు కొత్త తేదీ ఖరారు

తెలంగాణలో ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థులకు ముఖ్యమైన అప్‌డేట్ వెలువడనుంది. హోలీ పండుగ కారణంగా ఇంటర్ రెండో సంవత్సరం పరీక్షల షెడ్యూల్‌లో స్వల్ప మార్పు చోటు చేసుకుంది. ముందుగా మార్చి 3న నిర్వహించాల్సిన ఒక పరీక్షను ఒకరోజు వాయిదా వేసి, మార్చి 4న నిర్వహించేందుకు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

ప్రభుత్వం తాజాగా ప్రకటించిన సెలవుల జాబితా ప్రకారం హోలీ పండుగను మార్చి 3వ తేదీన జరుపుకోనున్నారు. ఇదే రోజు ఇంటర్ సెకండియర్ పరీక్ష షెడ్యూల్‌లో ఉండటంతో, విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తకుండా ఆ పరీక్షను మరుసటి రోజుకు మార్చాలని ఇంటర్ బోర్డు నిర్ణయించినట్లు తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన ఒకటి, రెండు రోజుల్లో విడుదలయ్యే అవకాశం ఉందని విద్యాశాఖ వర్గాలు చెబుతున్నాయి.

ఇక్కడ గమనించాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే…
కేవలం మార్చి 3న జరగాల్సిన ఒక్క పరీక్ష మాత్రమే వాయిదా పడుతుంది.మిగిలిన ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ పరీక్షలు అన్నీ ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే కొనసాగుతాయి.

విద్యార్థులు అయోమయానికి గురికాకుండా, అధికారిక నోటిఫికేషన్ వెలువడిన వెంటనే కొత్త తేదీని గమనించి తమ పరీక్షా సిద్ధతను ప్లాన్ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.బోర్డుల విలీనంపై ప్రభుత్వ ప్రణాళిక.ఇదిలా ఉండగా, తెలంగాణలో ఇంటర్ మరియు పదో తరగతి విద్యా వ్యవస్థలో కూడా కీలక మార్పులకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇంటర్ బోర్డు, పదో తరగతి బోర్డులను ఒకే గొడుగు కిందకు తీసుకొచ్చే దిశగా ప్రణాళికలు రూపొందుతున్నాయి. సీబీఎస్‌ఈ తరహాలో TGBSE (తెలంగాణ జనరల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్) ఏర్పాటు చేయాలనే ఆలోచనపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.

అలాగే టీచర్–విద్యార్థి నిష్పత్తిని పరిగణనలోకి తీసుకుని ఉపాధ్యాయుల సర్దుబాటు ప్రక్రియను కూడా అమలు చేయనున్నట్లు సమాచారం. ఈ మార్పులు త్వరలోనే అమల్లోకి వచ్చే అవకాశముందని విద్యాశాఖ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

#TelanganaInter#InterExamAlert#InterSecondYear#ExamPostponed#HoliHoliday#TSInterExams
#EducationNews#StudentAlert#TGEducation#TGBSE#BoardExams

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version