Sports

IND vs BAN 1st Test Day 1: అశ్విన్, జడ్డూల ఊచకోత.. భారీ స్కోర్ దిశగా భారత్

భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య జరుగుతున్న తొలి చెన్నై టెస్టు తొలి రోజు ఆట ముగిసే సరికి భారత్ 6 వికెట్లు కోల్పోయి 339 పరుగులు చేసింది. ఒకానొక సమయంలో జట్టు 144 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి, తక్కువ స్కోర్‌కే ఆలౌట్ అయ్యే ప్రమాదంలో కూరుకపోయింది. కానీ ఇక్కడ నుంచి రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్ 195 పరుగుల అజేయ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.

సొంతగడ్డపై అశ్విన్ సెంచరీ చేయగా, జడేజా 86 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. తొలి రోజు భారత్ తరపున యశస్వి జైస్వాల్ 56 పరుగులు, రిషబ్ పంత్ 39 పరుగులు, కేఎల్ రాహుల్ 16 పరుగులు చేశారు. రోహిత్ శర్మ, విరాట్ చెరో 6 పరుగులు చేసి ఔట్ కాగా, శుభమాన్ గిల్ ఖాతా కూడా తెరవలేకపోయాడు.

బంగ్లాదేశ్‌లో హసన్ మహమూద్ 4 వికెట్లు తీశాడు. మెహదీ హసన్ మిరాజ్, నహిద్ రానా తలో వికెట్ పడగొట్టారు. రెండో రోజు ఆట రేపు ఉదయం 9:30 గంటలకు ప్రారంభమవుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version