Andhra Pradesh

ఏపీలో ఓ వ్యక్తి.. ఏకంగా 155 మద్యం షాపులకు దరఖాస్తు

ఏపీలో మద్యం షాపుల లైసెన్సుల కోసం లాటరీ జరుగుతోంది. అయితే విశాఖపట్నంలో ఓ వ్యక్తి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు మొత్తం 155 మద్యం షాప్‌లకు గాను 155 షాపులకు దరఖాస్తు చేసుకున్నాడు. అయితే ఇప్పటి వరకు⁠ 23 షాపులకు లాటరీ పూర్తికాగా.. అతనికి ఒక్క షాపు కూడా రాలేదు. ఆయన తనను అదృష్టం ఎప్పుడు వస్తుందా అని ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఒక్క షాపైనా తనకు రాకపోదా అని ఎదురు చూస్తున్నాడు. అంటే ఒక్కో షాపుకు రూ.2 లక్షల రూపాయిల చొప్పున మొత్తం రూ.3 కోట్ల 10 లక్షలతో ఆ వ్యక్తి దరఖాస్తు చేశాడు.

మరోవైపు రాష్ట్రంలో మద్యం షాపులకు లాటరీలు కొనసాగుతున్నాయి. 26 జిల్లాల పరిధిలో ఇవాళ ఉదయం 8 గంటల నుంచే కలెక్టర్ల ఆధ్వర్యంలో ఈ ప్రక్రియ జరుగుతోంది. జిల్లా గెజిట్‌లో ప్రచురించిన షాపుల క్రమసంఖ్య ప్రకారం అధికారులు లాటరీ తీస్తున్నారు.. అక్కడ సందడి వాతావరణం నెలకొంది.

ముందస్తు జాగ్రత్తగా లాటరీ కేంద్రాల దగ్గర పోలీసులు ఆంక్షలు విధించారు. 100 మీటర్ల పరిధిలోనే వాహనాల రాకపోకలను నిలిపేస్తున్నారు.. దరఖాస్తు చేసుకున్న వారు కాలినడన మద్యం లాటరీ కేంద్రాలకు అనుమతిస్తున్నారు. అక్కడ లాటరీలో షాపు దక్కిన వారు ఆనందంలో మునిగి ఉంటే.. షాపు రానివారు మాత్రం నిరుత్సాహంగా ఉన్నారు. కొన్ని చోట్ల లాటరీ దక్కిన వారితో సిండికేట్ అయ్యేందుకు కొంతమంది బేరాలు చేస్తున్నారు. రాష్ట్రంలో మొత్తం 3,396 మద్యం షాపులకు 89,882 దరఖాస్తులు వచ్చిన సంగతి తెలిసిందే.. నాన్‌ రిఫండబుల్‌ రుసుముల రూపంలో ప్రభుత్వానికి రూ.1,797.64 కోట్ల మేర ఆదాయం వచ్చింది.

ఇక ఏపీలో మద్యం షాపులకు ఇవాళ లాటరీ తీస్తున్నారు.. మంగళవారం (అక్టోబర్ 15న) లైసెన్సులు, మిగిలిన ప్రక్రియ జరుగుతుంది. ఈ నెల షాపుల్ని అప్పగిస్తారు.. అంటే బుధవారం కొత్త లిక్కర్ పాలసీ అమల్లోకి వస్తుంది.. అంతేకాదు రాష్ట్రవ్యాప్తంగా మద్యం స్టాక్ డిపోలకు చేరుతోంది. అక్కడి నుంచి రాష్ట్రవ్యాప్తంగా అన్ని షాపులకు స్టాక్‌ను పంపించనున్నారు. ఈ నెల 16 నుంచి ప్రైవేట్ షాపుల్లో విక్రయాలు మొదలవుతాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version