Latest Updates

నటి కస్తూరికి షాక్ ఇచ్చిన మద్రాస్ హైకోర్టు.. ఆమెకు బెయిల్ ఇవ్వకుండా తిరస్కరించింది.

నటి కస్తూరికి షాక్ ఇచ్చిన మద్రాస్ హైకోర్టు.. ఆమెకు బెయిల్ ఇవ్వకుండా తిరస్కరించింది.

తెలుగు వారి పట్ల వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నటి కస్తూరిని అరెస్ట్ చేయడానికి రెండు ప్రత్యేక పోలీసు బృందాలను అధికారులు నియమించారు నవంబరు 3వ తేదీ ఎగ్మూర్‌ రాజరత్నం స్టేడియం సమీపంలో హిందూ మక్కల్‌ కట్చి ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాలో నటి కస్తూరి పాల్గొన్నారు. ఈ సమయంలో, తెలుగు వారి గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై తమిళనాడులో పెద్ద ఆగ్రహం వ్యక్తమైంది. అందుకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేశారు.

తెలుగువారిపై అనుచిత వ్యాఖ్యల కేసులో సీనియర్ నటి కస్తూరి శంకర్‌కు మద్రాసు హైకోర్టులో బెయిల్‌ను కోర్టు తిరస్కరించింది. కస్తూరి పిటిషన్‌పై విచారణ చేపట్టి, నిర్ణయాన్ని వాయిదా వేసిన మదురై ధర్మాసనం.. గురువారం ఉదయం తీర్పు వెలువరించింది. కస్తూరి బెయిల్ పిటిషన్‌ను తిరస్కరిస్తున్నట్టు తాజాగా ప్రకటించింది. వాస్తవారికి బెయిల్ పిటిషన్ విచారణ సమయంలో కస్తూరిపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తెలుగువారు తమిళనాడుకు వలస వచ్చిన వారిగా ఎలా అంటారని మండిపడింది. అభివృద్ధిలో  తెలుగువారు  కీలక భాగస్వామిగా ఉన్న వారిని పేర్కొంది.

తమిళనాడులో తెలుగువారు, తమిళులను వేరుచేసి చూడలేమని స్పష్టం చేసింది. కస్తూరి చేసిన వ్యాఖ్యలపై ఎలాంటి చర్యలు తీసుకున్నారని ఈ సందర్భంగా ప్రభుత్వ తరపు న్యాయవాది, పోలీసులను అడిగింది. వ్యాఖ్యలు సోషల్ మీడియా నుంచి తొలగించారా? లేదా? అని కూడా ప్రశ్నించింది. ఇటీవల చెన్నైలో బ్రాహ్మణ సమాజం సమ్మేళనంలో పాల్గొన్న బీజేపీ నాయకురాలు కస్తూరి.. తమిళనాడులో స్థిరపడ్డ తెలుగు వారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. 300 ఏళ్ల కిందట రాజుల పాలనలో తమిళనాడులోని అంతఃపుర మహిళలకు సేవచేయడానికి వచ్చినవాళ్లే తెలుగువారని, ఇప్పుడు వాళ్లు తమిళులుగా చలామణి అవుతున్నారంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి.

కస్తూరి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ప్రజలలో పెద్ద ఎత్తున ఆగ్రహాన్ని రేపాయి. తెలుగు, తమిళ ప్రజల మధ్య విభేదాలు పెరిగేలా చెప్పారని ప్రజా సంఘాలు విమర్శించాయి. ఆమెపై పోలీసులకు ఫిర్యాదు చేయబడింది. అందువల్ల పలు సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. నోటీసులు ఇవ్వడానికి పోయెస్ గార్డెన్‌లో ఉన్న ఆమె ఇంటికి వెళ్లారు. అయితే, ఆ ఇంట్లో తాళం వేసి ఉండటంతో ఆమెను ఫోన్‌ ద్వారా సంప్రదించడానికి ప్రయత్నించగా, ఫోన్ స్విచ్‌ఆఫ్ అయ్యింది. ఆ తరువాత ఆమె కన్పించలేదు. సోమవారం, ఆమె ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు.
మద్రాసు హైకోర్టు మదురై ధర్మాసనంలో పిటిషన్ వేయగా.. దానిపై విచారణ చేపట్టిన న్యాయమూర్తి తీర్పు రిజర్వులో ఉంచారు. గురువారం దీనిపై నిర్ణయాన్ని వెలువరించారు. హైకోర్టులో ఊరట దక్కకపోవడంతో నటి కస్తూరి అరెస్ట్ నుంచి తప్పించుకోవడం అసాధ్యమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version