Entertainment

Bigg Boss 8 Telugu Day 25: ఆ ముగ్గురు మళ్లీ ఒకే జట్టు..

బిగ్‌బాస్ హౌస్‌లో సీత కొత్తగా చీఫ్ అయిన సంగతి తెలిసిందే. దీంతో మరోసారి రెండు క్లాన్‌ సభ్యులను మరోసారి టీమ్స్ సెలక్ట్ చేసుకునే ఛాన్స్ ఇచ్చాడు బిగ్‌బాస్. దీంతో విష్ణుప్రియ, నైనిక, నబీల్, ఆదిత్య, యష్మీ ఇలా అందరూ తమ రీజన్స్ చెప్పి సీత క్లాన్‌నే సెలక్ట్ చేసుకున్నారు. ఇక సోనియా, పృథ్వీ మాత్రమే నిఖిల్ టీమ్‌లోకి వెళ్లారు. అయితే అప్పటికే సీత టీమ్‌లో ఆరుగురు సభ్యులు అవడంతో బిగ్‌బాస్ కలుగజేసుకున్నాడు.

సీత టీమ్ ఇప్పటికే ఫుల్ అయింది కాబట్టి.. మణికంఠ మీరు శక్తి క్లాన్‌లోకి వెళ్లాలి.. ఒక వేళ మీరు కాంతార క్లాన్‌లోకి వెళ్లాలంటే సీత తన టీమ్‌లో ఎవరో ఒకరిని శక్తి టీమ్‌తో స్వాప్ చేయాలి.. అంటూ బిగ్‌బాస్ అన్నాడు. దీంతో సీతను రిక్వెస్ట్ చేశాడు మణికంఠ. కానీ తన టీమ్‌లోకి అందరూ ఇష్టపూర్వకంగా రావడంతో వాళ్లని స్వాప్ చేసి హర్ట్ చేయలేనని.. మరోసారి అవకాశం వస్తే తన టీమ్‌లోకి తీసుకుంటా అంటూ సీత చెప్పింది. దీంతో తప్పక మణికంఠ.. నిఖిల్ టీమ్‌లోకి వెళ్లాల్సి వచ్చింది.

యష్మీ రాక్స్.. సోనియా షాక్స్
ఆ తర్వాత చివరిగా ప్రేరణ మిగిలిపోయింది. దీంతో ప్రేరణకి కూడా మణికంఠకి చెప్పిన అదే సోది చెప్పాడు బిగ్‌బాస్. కానీ దీనికి ప్రేరణ ఒప్పుకోలేదు. అదేంటి బిగ్‌బాస్ అందరికీ తమ క్లాన్‌ను సెలక్ట్ చేసుకునే ఛాన్స్ ఇచ్చారు.. కానీ మమ్మల్ని లాస్ట్‌లో పిలుస్తారా.. నాకు ఛాయిస్ లేకుండా చేశారు.. అంటూ ప్రేరణ అంది. ఇక సీత.. మణికంఠకి చెప్పినట్లే స్వాప్ చేయడం కుదరదంటూ ప్రేరణకి కూడా చెప్పింది. అయితే ఇక్కడ తన ఫ్రెండ్ ప్రేరణ కోసం యష్మీ త్యాగం చేసింది. వద్దు తను ఏడవడం నేను చూడలేను.. నేను నిఖిల్ టీమ్‌లోకి స్వాప్ అవుతాను.. ప్రేరణను తీసుకో అంటూ సీతకి చెప్పింది యష్మీ. దీంతో ప్రేరణ.. సీత టీమ్‌లోకి రాగా.. యష్మీ.. నిఖిల్ చీఫ్ అయిన శక్తి టీమ్‌లోకి వెళ్లింది. ఈ ట్విస్ట్‌ను ఊహించని సోనియాకి కాసేపు మైండ్ బ్లాంక్ అయిపోయింది.

ఇలా నిఖిల్ శక్తి క్లాన్‌లో సోనియా, పృథ్వీ, మణికంఠ, యష్మీ వచ్చారు. అటు సీత టీమ్‌లో విష్ణుప్రియ, నైనిక, ఆదిత్య, నబీల్, ప్రేరణ ఉన్నారు. కాంతార టీమ్ పెద్దదైనా కారణంగా డ్రాగన్ ఫ్లై రూమ్‌ను వారికే ఇచ్చేశాడు బిగ్‌బాస్. ఇక ఈ సెలక్షన్ అయిపోయిన తర్వాత సీత తన టీమ్‌తో మాట్లాడుతూ నిఖిల్‌, సోనియాలపై గట్టిగానే కౌంటర్లు వేసింది. “నాకు మైండ్ బ్లాంక్ అయిపోయింది.. ఒక్కరంటే ఒక్కరు కూడా ఆ క్లాన్‌కి వెళ్లలేదు.. ఇప్పుడైనా వాళ్లకి అర్థం కావాలి.. ఫ్రెండ్ షిప్, బాండ్ గురించి వాళ్లారా మాట్లాడేది.. మరి రెడ్ ఎగ్ సోనియాకి ఎందుకిచ్చాడురా..” అంటూ సీత కౌంటర్ల మీద కౌంటర్లు వేసింది.

ఆ ముగ్గురినీ విడగొట్టమంటూ
మరోవైపు సోనియా సోది మొదలెట్టేసింది. “అస్తమానం సోనియానే వీళ్లిద్దరూ కన్సిడర్ చేస్తారని వాళ్లకి కోపం నా మీద.. కానీ అదే టైమ్‌లో మీరిద్దరూ అంటే ఇష్టం కదరా వాళ్లకి.. మరి నేను ఏం పాపం చేసినా.. మీ ఇష్టానికి నేను ఎందుకు బలి కావాలి..” అంటూ నిఖిల్-పృథ్వీలతో చెప్పుకొచ్చింది సోనియా.

ఇంకోవైపు ప్రేరణతో మాట్లాడుతూ “ఈ అవకాశంతో నీకు విష్ణుప్రియకి, నీకూ సీతకి ఇలా అందరితో ఉన్న క్లాషెస్ సాల్వ్ చేసుకో..” అంటూ యష్మీ సలహా ఇచ్చింది. అయితే యష్మీ నువ్వు అక్కడ వాయిస్ ఔట్ చేయాలి.. వాళ్లు చేసే తప్పుల్ని చెప్పాలంటూ నబీల్ సహా మిగిలినవాళ్లు అన్నారు. ఇక ఆదిత్య అయితే సోనియాకి యష్మీకి మంచి బాండ్ అవుతుంది.. అంటూ జోక్ చేశాడు. అది మాత్రం అవదు.. అఖండలో ఉన్నప్పుడే అవ్వలేదు.. అంటూ యష్మీ కౌంటర్ ఇచ్చింది. ఆ ట్రయో (నిఖిల్-పృథ్వీ-సోనియా) బాండ్‌ను యష్మీ విడగొడుతుందేమో చూడాలి.. అంటూ ప్రేరణ జోక్ చేసింది.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version