Andhra Pradesh

ద్వారకా తిరుమల శ్రీవారి ఆలయానికి భక్తుడు భారీ విరాళం..

ద్వారకా తిరుమల ఆలయానికి భక్తుడు భారీ విరాళం అందించారు. దీపక్‌ నెక్స్‌జన్‌ ఫీడ్స్‌ సంస్థ రూ.1,64,19,411 విరాళం అందించగా.. ఆ డబ్బుతో తయారు చేయించిన ఒక బంగారు తాపడాన్ని ద్వారకా తిరుమల శ్రీవారి గర్భాలయంలో అమర్చారు. ఈ సందర్భంగా దీపక్‌ నెక్స్‌జన్‌ ఫీడ్స్‌ సంస్థ ఎండీ అడుసుమిల్లి వెంకట సుబ్రహ్మణ్యం, డైరెక్టర్లు.. స్వామి, అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ద్వారకా తిరుమల ఆలయ అర్చకులు, పండితులు వారికి స్వామివారి శాలువాలు కప్పి వేదాశీర్వచనం, తీర్థ ప్రసాదాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఛైర్మన్‌ సుధాకరరావు, అనువంశిక ధర్మకర్త నివృతరావు శ్రీవారి చిత్రపటాలను బహూకరించారు. ఈ విరాళానికి సంబంధించిన పత్రాన్ని కంపెనీ ప్రతినిధులు ఆలయ ఛైర్మన్‌కు అందించారు.

మరోవైపు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రభుత్వ నిర్ణయంతో ఆలయాలకు మహర్దశ కలిగింది. రాష్ట్రవ్యాప్తంగా ఆదాయం లేని దేవాలయాలకు దూప దీప నైవేద్య సాయాన్ని 5 వేల నుంచి 10 వేల వరకు పెంచుతూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
ఉమ్మడి జిల్లాలో ఉన్న 281 దేవాలయాలకు ఇది వర్తిస్తుందంటున్నారు అర్చకులు. ఉమ్మడి జిల్లాలో దేవాదాయ శాఖ పరిధిలో ఒకటో రెండో ఆలయాలుంటే.. చిన్న ఆలయాలు ఎక్కువ సంఖ్యలో ఉన్నాయి. ఈ చిన్న ఆలయాలకు ఎలాంటి ఆదాయాలు లేవు.

ఈ ఆలయాలకి ఎలాంటి ఆదాయం లేకపోవడంతో అక్కడి స్థానికులే కమిటీలుగా ఏర్పడి అర్చకులను ఏర్పాటు చేసుకున్నారు. మరికొన్ని చోట్ల పండుగలకు మాత్రమే అర్చకులతో ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం ఇకపై ఆయా అర్చకులను కూడా ప్రోత్సహించాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రభుత్వం ధూప, దీప, నైవేద్యాల కోసం.. ప్రస్తుతం పెంచిన సాయం రూ.28.10 లక్షలు నెలనెలా అర్చకుల ఖాతాలకే జమ చేస్తారు. ఉమ్మడి జిల్లాలో ప్రైవేటు నిర్వహణలో సుమారు 2,592 చిన్న ఆలయాలు ఉండగా.. వీటికి కూడా ప్రోత్సాహం అందించాలని దేవాదాయ శాఖ ప్రతిపాదనలు చేసిన సంగతి తెలిసిందే.

గతంలో టీడీపీ ప్రభుత్వం ఈ సాయాన్ని రూ. 2,500 నుంచి రూ. 5 వేలకు పెంచిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత వచ్చిన జగన్ సర్కార్ ఐదేళ్లలో పైసా కూడా పెంచలేదనే విమర్శలు ఉన్నాయి… పెరిగిన ధరలతో రూ.5 వేలకు ఆలయంలో సరిపోవడం లేదనే ప్రభుత్వం రూ.10వేలకు పెంచింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version