Entertainment

BCCI తీరుపై కృష్ణమాచారి శ్రీకాంత్ అసహనం

ടി20 ലോകകപ്പിലെ ടീം തിരഞ്ഞെടുപ്പിൽ സ്വജനപക്ഷപാതം'; ബിസിസിഐയെ വിമർശിച്ച് കെ.  ശ്രീകാന്ത്

భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఇటీవల తీసుకుంటున్న నిర్ణయాలపై మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ అసహనం వ్యక్తం చేశారు. ముఖ్యంగా సీనియర్ క్రికెటర్లకు ఇచ్చే గౌరవం, వారికి అందించాల్సిన వీడ్కోలు విషయంలో బోర్డు ప్రవర్తన సరిగ్గా లేదని ఆయన విమర్శించారు. “దేశం కోసం 100 టెస్టులు ఆడిన ప్లేయర్‌కు కనీసం సరైన సెండాఫ్ ఇవ్వకపోవడం విచారకరం” అని వ్యాఖ్యానించారు.

శ్రీకాంత్ అభిప్రాయపడిన దానిలో, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి లాంటి సీనియర్ క్రికెటర్లకు కూడా బీసీసీఐ నుంచి తగినంత గౌరవం అందలేదని స్పష్టం చేశారు. వారితో స్పష్టంగా కమ్యూనికేట్ చేయకుండా, ఒక్కసారిగా మార్పులు తీసుకురావడం వల్ల క్రికెటర్లు, అభిమానులు గందరగోళానికి గురవుతున్నారని ఆయన అన్నారు. ఇదే పరిస్థితి చతేశ్వర్ పుజారా విషయంలోనూ చోటుచేసుకుందని శ్రీకాంత్ గుర్తుచేశారు.

సెలక్టర్లు, ప్లేయర్లు, బీసీసీఐ మధ్య సరైన సమన్వయం లేకపోవడం వల్లే ఈ సమస్యలు వస్తున్నాయని మాజీ క్రికెటర్ వ్యాఖ్యానించారు. రిటైర్మెంట్ లాంటి కీలకమైన విషయాలపై సంబంధిత ఆటగాళ్లతో ముందుగానే చర్చలు జరపాల్సిందని ఆయన సూచించారు. “ప్లేయర్-సెలక్టర్స్-BCCI మధ్య పరస్పర అవగాహన ఉంటే ఇలాంటి వివాదాలు రావు” అని శ్రీకాంత్ తన అభిప్రాయం వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version