Andhra Pradesh

తిరుమలలో చల్లని వాతావరణం, ప్రకృతి అందాలు, మంచు తెరలతో కొత్త అనుభూతి.

తిరుమలలో చల్లని వాతావరణం, ప్రకృతి అందాలు, మంచు తెరలతో కొత్త అనుభూతి.

తిరుమలలో వాతావరణం మారింది. బంగాళాఖాతంలో అల్పపీడనం వల్ల తిరుమలను దట్టమైన పొగ కప్పేసింది. శ్రీవారి ఆలయం, పరిసరాలు మంచుతో నిండి ఉన్నాయి. తిరుమల కొండలు మంచుతో కప్పబడటంతో ఆకాశం కిందకు వచ్చినట్లు అనిపిస్తోంది. భక్తులు చల్లని వాతావరణంలో కొత్త అనుభూతి పొందుతున్నారు. మరోవైపు, అల్పపీడనం కారణంగా తిరుమలలో రెండు మూడు రోజులు వర్షాలు పడే అవకాశం ఉంది.

తిరుమలలో చల్లని వాతావరణం ఉంది. బంగాళాఖాతంలో అల్పపీడనం వల్ల తిరుమల గిరులు మంచు పొగతో కప్పబడ్డాయి. ఆలయం చుట్టు ప్రాంతాలు ఆకాశం కిందకి వచ్చినట్లు కనిపిస్తున్నాయి. ఈ వాతావరణం ఆధ్యాత్మిక శోభకు తోడుగా ప్రకృతి అందాలు భక్తులను ఆకట్టుకుంటున్నాయి. తిరుమల అందాలను చూసి భక్తులు కొత్త అనుభూతిని పొందుతున్నారు.

శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ఇవాళ జరగాల్సిన కార్తీక వనభోజన కార్యక్రమంలో వర్షం కారణంగా మార్పు జరిగింది. వనభోజనం ఆలయంలోనే నిర్వహించనున్నారు. కార్తీక మాసంలో ద్వాదశి నాడు వనభోజనం నిర్వహించడం ఆనవాయితీ. ఉదయం 7 నుండి 9 గంటల మధ్య స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను ఊరేగింపుగా పార్వేట మండపానికి తీసుకెళ్లాలి. కానీ వర్షం వల్ల ఈ కార్యక్రమాన్ని ఆలయంలోనే నిర్వహించాలని టిటిడి నిర్ణయించింది. ఇతర కార్యక్రమాలు కూడా ఆలయంలోనే జరుగుతాయి. భక్తులు ఈ మార్పును గమనించాలనిచెప్పారు.

బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో తిరుపతి జిల్లాలో మూడు రోజుల పాటు భారీ వర్షాలు పడతాయని వాతావరణశాఖ చెబుతోంది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఐదు ప్రాంతాల్లో సహాయ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. అధికారులు, ఉద్యోగులు అప్రమత్తంగా ఉండి ముంపు సమస్యలు నివారించాలని సూచించారు. కలెక్టరేట్‌ నుంచి టెలీకాన్ఫరెన్స్‌ ద్వారా సంబంధిత అధికారులకు సూచనలు చేశారు. గ్రామాలు, పట్టణాల్లో పర్యటించి డ్రైనేజీ సమస్యలు తలెత్తకుండా చూడాలని చెప్పారు. మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లొద్దని, అవసరమైన సందర్భాల్లో సహాయ కేంద్రాలను సంప్రదించాలని ప్రజలను కోరారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version