Latest Updates

వారణాసిలో రైలు పట్టాల మధ్యలో సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు – దేశంలోనే తొలిసారి

Solar Panels : రైలు పట్టాల మధ్యలో సోలార్ ప్యానెళ్లు - Vaartha Telugu

ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో ఇండియన్ రైల్వే వినూత్న ప్రయత్నానికి శ్రీకారం చుట్టింది. బనారస్ లోకోమోటివ్ వర్క్స్ (BLW) ప్రాంగణంలో తొలిసారిగా రైలు పట్టాల మధ్యలో సోలార్ ప్యానెల్స్ అమర్చారు. ఇప్పటివరకు రైల్వే స్టేషన్ల భవనాలపై, ఖాళీ ప్రదేశాల్లోనే సోలార్ ప్యానెల్స్ అమర్చిన అధికారులు, ఇప్పుడు ట్రాక్ మధ్యలో ఈ సాంకేతికతను పరీక్షించటం విశేషం.

రైల్వే అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, ఈ ప్రయత్నం విజయవంతమైతే రైళ్లకు అవసరమైన విద్యుత్ అవసరంలో కొంత భాగాన్ని నేరుగా సోలార్ ఎనర్జీ ద్వారా పొందవచ్చు. దీంతో విద్యుత్ ఖర్చులు తగ్గడమే కాకుండా, కర్బన ఉద్గారాలను కూడా గణనీయంగా తగ్గించవచ్చని అంచనా. పర్యావరణహిత మార్గాల్లో రైలు ప్రయాణాన్ని అభివృద్ధి చేయడం రైల్వే ముఖ్య లక్ష్యమని వారు వెల్లడించారు.

సోలార్ ప్యానెల్స్‌ను పట్టాల మధ్య అమర్చడం అనేది దేశంలోనే మొదటి ప్రయత్నమని అధికారులు గర్వంగా చెబుతున్నారు. ఈ ప్రయోగం విజయవంతమైతే దేశవ్యాప్తంగా ఉన్న రైల్వే ట్రాక్‌లలో ఈ విధానాన్ని అమలు చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇప్పటికే సోషల్ మీడియాలో ఈ వినూత్న ఆలోచనపై చర్చ నడుస్తూ, “ఇలాంటి ప్రాజెక్టులు మరింత విస్తరించాలి” అంటూ నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version