Andhra Pradesh

రాఖీ కట్టలేనేమో తమ్ముడూ.. జాగ్రత్త” – సూసైడ్ నోట్‌లో నవ వధువు చివరి వాక్యం

ఆంధ్రప్రదేశ్‌ కృష్ణా జిల్లా కలవపాములలో మానసిక వేదన మరో உயிரిని బలి తీసుకుంది. అక్కడి ఓ ప్రైవేట్ కాలేజీలో లెక్చరర్గా పనిచేస్తున్న శ్రీవిద్య (24) ఆత్మహత్యకు పాల్పడింది. ఆరు నెలల క్రితం గ్రామ వాలంటీర్‌గా పనిచేస్తున్న విలేజ్ సర్వేయర్ రాంబాబుతో ఆమె వివాహమైంది.

వివాహం తర్వాత భర్త నుండి ఎదుర్కొంటున్న వేధింపులను తట్టుకోలేక చివరకు ప్రాణాలను విడిచింది. ఆమె రాసిన సూసైడ్ నోట్ లోని కొన్ని వాక్యాలు హృదయాన్ని కలచివేస్తున్నాయి. “నన్ను బాగా కొడుతున్నాడు.. ఇక నేను ఉండలేను.. తమ్ముడూ జాగ్రత్త.. ఈసారి నీకు రాఖీ కట్టలేనేమో.. అమ్మ నాన్నను జాగ్రత్తగా చూసుకో” అంటూ తుదివాక్యాల్లో పేర్కొంది.

శ్రీవిద్య ఆత్మహత్య ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. భర్త వేధింపులు వల్లే ఈ తీవ్ర నిర్ణయం తీసుకున్నట్లు కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. రాఖీ పండుగ ముందు ఇలా ఓ అక్కను కోల్పోయిన తమ్ముడు కన్నీటి గాథగా మారాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version