Latest Updates

మా నాయకుడు కేసీఆరే: బీఆర్ఎస్‌లో ఐక్యతపై ఎమ్మెల్సీ కవిత గట్టి సందేశం

డియర్​ డాడీ - బీజేపీని ఇంకొంచెం టార్గెట్‌ చేయాల్సిందేమో' : కేసీఆర్​కు కవిత  సుధీర్ఘ ఫీడ్​బ్యాక్

భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, పార్టీ అధినేత కె. చంద్రశేఖర్ రావు (కేసీఆర్)కు తాను రాసిన లేఖ బయటకు వచ్చిన నేపథ్యంలో కాంగ్రెస్, బీజేపీ పార్టీలు సంబరపడుతున్నాయని విమర్శించారు. బీఆర్ఎస్‌లో ఏదో సమస్య తలెత్తినట్లు ప్రతిపక్షాలు భావిస్తున్నప్పటికీ, పార్టీ బలంగా, ఐక్యంగా ఉందని కవిత స్పష్టం చేశారు. “మా నాయకుడు కేసీఆరే. ఆయన నాయకత్వంలోనే బీఆర్ఎస్ ముందుకు సాగుతుంది. కేసీఆర్ నాయకత్వం వల్లే తెలంగాణ రాష్ట్రం బాగుపడుతుంది,” అని ఆమె గట్టిగా చెప్పారు.

పార్టీలో చిన్నపాటి లోపాలు ఉండవచ్చని, వాటిని సరిచేసుకుని, ‘కోవర్టులను’ తొలగిస్తే బీఆర్ఎస్ దీర్ఘకాలం బలంగా నిలదొక్కుకుంటుందని కవిత తన భావనను వ్యక్తం చేశారు. “పార్టీలో ఏదో అయిపోయిందని కొందరు అనుకుంటున్నారు, కానీ ఏం కాలేదు. చిన్న చిన్న సమస్యలను సరిదిద్దుకుంటే బీఆర్ఎస్ 10 కాలాలపాటు చల్లగా ఉంటుంది,” అని ఆమె పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలతో కవిత, పార్టీలో ఐక్యత మరియు కేసీఆర్ నాయకత్వంపై తనకున్న నమ్మకాన్ని స్పష్టం చేస్తూ, ప్రతిపక్షాల ఊహాగానాలను తిప్పికొట్టారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version