News
పహల్గామ్ ఘటన తర్వాత ఇందిర గురించి చర్చ: రేవంత్
మరోవైపు, తమ ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం రూ.60 వేల కోట్లు ఖర్చు చేసినట్లు రేవంత్ రెడ్డి వెల్లడించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రేషన్ కార్డుదారులకు సన్న బియ్యం అందిస్తున్నామని, అలాగే 60 వేల ఉద్యోగాలను కల్పించినట్లు ఆయన తెలిపారు. రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, కొత్త రేషన్ కార్డుల వంటి పథకాలతో తెలంగాణ ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తున్నామని సీఎం హామీ ఇచ్చారు.