Andhra Pradesh

చంద్రబాబు ఆధ్వర్యంలో ఏపీ అభివృద్ధి: మల్లారెడ్డి

Malla reddy: చంద్రబాబు ఆరోగ్య పరిస్థితి తెలిసి చాలా బాధేసింది: మంత్రి  మల్లారెడ్డి

తిరుమల: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో రాష్ట్రం వేగంగా అభివృద్ధి చెందుతోందని బీఆర్ఎస్ నేత మల్లారెడ్డి పేర్కొన్నారు. ఈ అభివృద్ధికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా వేల కోట్ల రూపాయల నిధులు కేటాయిస్తూ సహకరిస్తున్నారని ఆయన తెలిపారు. తిరుమలలో మీడియాతో మాట్లాడిన మల్లారెడ్డి, ఏపీ భవిష్యత్తు ఆశాజనకంగా ఉందని వ్యాఖ్యానించారు.

తెలంగాణ ప్రస్తుత పరిస్థితిని ప్రస్తావించిన ఆయన, రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం తీవ్రంగా దెబ్బతిన్నదని అన్నారు. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో ఆస్తులు అమ్మి తెలంగాణలో కొనుగోలు చేసే పరిస్థితి ఉండేదని, అయితే ఇప్పుడు పరిస్థితి తారుమారైందని ఆయన విమర్శించారు. రియల్ ఎస్టేట్ రంగం క్షీణించడం పెట్టుబడిదారులకు ఆందోళన కలిగించే అంశమని అభిప్రాయపడ్డారు.

ఈ సందర్భంగా మాజీ సీఎం కేసీఆర్ మళ్లీ తెలంగాణ ముఖ్యమంత్రిగా రావాలనే తన ఆకాంక్షను వ్యక్తం చేశారు. ఆయన పాలనలో రాష్ట్రం అభివృద్ధి దిశగా పయనించిందని, ప్రస్తుతం పరిస్థితులు ఆ దిశగా లేవని వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రజలు మళ్లీ కేసీఆర్‌ను అవకాశం ఇవ్వాలని మల్లారెడ్డి కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version