Latest Updates

కెరీర్ ఎంపికపై అయోమయం: 70% మంది విద్యార్థులకు క్లారిటీ లేదు – విరాల్ దోషీ ముంబై:

Viral Doshi who heps young Indians get into Ivy colleges - Rediff.com

దేశంలోని విద్యార్థులలో కెరీర్ విషయంలో స్పష్టత లేకపోవడం పెద్ద సమస్యగా మారిందని ప్రఖ్యాత విద్యా, కెరీర్ గైడెన్స్ నిపుణుడు విరాల్ దోషీ పేర్కొన్నారు. టెన్త్, ఇంటర్మీడియట్ పూర్తయ్యాక ఏ కోర్సు, ఏ రంగంలో చదవాలో 70 శాతం మంది విద్యార్థులు స్పష్టత లేకుండా అయోమయంలో పడుతున్నారని ఆయన తాజా వ్యాఖ్యల్లో వెల్లడించారు.

విరాళ్ దోషీ ప్రకారం, “మొత్తం విద్యార్థుల్లో కేవలం 30 శాతమే తమ భవిష్యత్ లక్ష్యాలపై స్పష్టతతో ఉన్నారు. మిగిలినవారు తల్లిదండ్రుల అభిప్రాయాలు, సమాజపు అంచనాలు, స్నేహితుల ఒత్తిడిలో నిర్ణయాలు తీసుకుంటూ భ్రమలో పడుతున్నారు. ఇది వారికే కాకుండా సమాజానికీ ప్రమాదకరం,” అన్నారు.

వృత్తిని ఎంచుకునే సమయంలో వ్యక్తిగత ఆసక్తి, నైపుణ్యాలనే ఆధారంగా తీసుకోవాలని సూచించిన దోషీ, విద్యార్థులు తమకు ఇష్టమైన రంగాన్ని సెలెక్ట్ చేసుకుంటేనే దీర్ఘకాలంలో స్థిరమైన విజయాన్ని సాధించగలరని పేర్కొన్నారు.

అలాగే, విద్యార్థి విజయం ఆయన ఏ కళాశాలలో చదువుతున్నాడనే అంశంపై కాకుండా, ఆయన సంకల్పం, పట్టుదల, కృషిపై ఆధారపడి ఉంటుంది అని చెప్పారు. “ఓ పాఠశాల పేరు కాదు, విద్యార్థి దృక్కోణమే అతని భవిష్యత్తును నిర్మించుతుంది,” అని అన్నారు.

ఈ సందర్భంగా తల్లిదండ్రులు, విద్యా సంస్థలు విద్యార్థుల్లో స్వీయవిశ్లేషణకు ప్రోత్సాహం ఇవ్వాలని, వారిలో నైపుణ్యాలు గుర్తించి వాటి ఆధారంగా మార్గదర్శనం చేయాలని విరాల్ దోషీ సూచించారు.

ఈ వ్యాఖ్యలు విద్యార్థులు, తల్లిదండ్రులు, మరియు విద్యా రంగ నిపుణుల మధ్య సుదీర్ఘ చర్చకు దారితీయనున్నాయి.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version