Andhra Pradesh

ఏలూరు కలెక్టరేట్‌లో కరోనా కలకలం: నలుగురు ఉద్యోగులకు కొవిడ్ పాజిటివ్

విశాఖలో మళ్లీ కరోనా అలజడి.. యువతికి పాజిటివ్‌

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు మెల్లగా పెరుగుతున్న నేపథ్యంలో, ఏలూరు జిల్లా కలెక్టరేట్‌లో నలుగురు ఉద్యోగులకు కొవిడ్-19 పాజిటివ్ నిర్ధారణ కావడం కలకలం రేపుతోంది. ఈ ఉద్యోగుల్లో ఒక మహిళ కూడా ఉన్నారు. వీరందరినీ హోమ్ ఐసోలేషన్‌లో ఉంచి, అవసరమైన వైద్య చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనతో కలెక్టరేట్‌లోని మిగతా ఉద్యోగులందరికీ వైద్య పరీక్షలు నిర్వహించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.

మరోవైపు, గుంటూరు జిల్లాలో కూడా కరోనా కేసులు నమోదవుతున్నాయి. తెనాలిలో ఒక కరోనా కేసు, తాడేపల్లిలో మరొక కేసు నిర్ధారణ అయినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ఆరోగ్య శాఖ అధికారులు అప్రమత్తమై, పరీక్షలను ముమ్మరం చేయడంతో పాటు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు సూచిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version