International

వేదా కృష్ణమూర్తి క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన భారత మహిళల జాతీయ కీలక బాటర్‌

Two weeks after mother's death, Veda Krishnamurthy loses sister to Covid |  Cricket News - The Indian Express

భారత మహిళల జాతీయ క్రికెట్ జట్టులో మధ్యమ క్రమంలో కీలక బాటర్‌గా నిలిచిన వేదా కృష్ణమూర్తి తన అంతర్జాతీయ కెరీర్‌కు ముగింపు పలికారు. రిటైర్మెంట్ ప్రకటించిన ఆమె, భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించడం ఎంతో గర్వకారణంగా ఉందని భావావేశంతో చెప్పారు. కర్ణాటకకు చెందిన వేదా, భారత్ తరఫున 48 వన్డేల్లో 829 పరుగులు, 76 టీ20ల్లో 875 పరుగులు నమోదు చేశారు. 2017 వన్డే ప్రపంచకప్, 2018, 2020 టీ20 ప్రపంచకప్‌లలోనూ జాతీయ జట్టులో కీలక సభ్యురాలిగా తలబడ్డారు.

కేవలం అంతర్జాతీయ మ్యాచ్‌లకే కాకుండా దేశవాళీ లీగ్‌ల్లోనూ ఆమె సత్తా చాటారు. మహిళల ప్రీమియర్ లీగ్ (WPL)లో గుజరాత్ జెయింట్స్ తరఫున ఆడిన ఆమె, మహిళల బిగ్ బాష్ లీగ్ (WBBL)లో ఆడిన మూడో భారత మహిళా క్రికెటర్‌గా గుర్తింపు పొందారు. గత రెండు దశాబ్దాలుగా మహిళా క్రికెట్ అభివృద్ధికి మద్దతుగా నిలిచిన వేదా, తన కెరీర్ మొత్తం యువతకు స్ఫూర్తిగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version