Telangana

రేవంత్ సర్కార్ కొత్త సంవత్సరం గిఫ్ట్.. అంగన్వాడీల్లో జనవరి నుంచే బ్రేక్‌ఫాస్ట్ పథకం

నూతన సంవత్సరం సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం అంగన్వాడీ విద్యార్థుల కోసం మంచి వార్త ప్రకటించింది. 2026 జను మొదటి వారంలో రాష్ట్రంలోని అంగన్వాడీల్లో కొత్త అల్పాహార పథకం ప్రారంభం కానుంది. మొదట హైదరాబాద్‌లో పైలట్ ప్రాజెక్ట్‌గా అమలు చేసి, తక్కువ స‌మయంలో విజయవంతమైతే రాష్ట్రవ్యాప్తంగా విస్తరించనుంది. ఈ కార్యక్రమంలో టీజీ ఫుడ్స్ ద్వారా కిచిడీ, ఉప్మా వంటి రెడీ-టు-ఈట్ ఆహారాన్ని చిన్నారులకు అందించనున్నారు.

ఈ పథకం సుమారు 8 లక్షల మంది అంగన్వాడీ విద్యార్థుల ఆకలి తీర్చడం మాత్రమే కాక, వారి ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరచడం లక్ష్యం. ప్రత్యేకంగా, ఈ కార్యక్రమం బాలల పోషకాహార లోపాన్ని తగ్గించి, ఆరోగ్యంగా ఎదిగేందుకు సహాయపడుతుంది.

ప్రతి రోజు ఒకరోజు కిచిడీ, మరొక రోజు ఉప్మా వంటివి విద్యార్థులకు అందిస్తారు. రెడీ-టు-ఈట్ ఆహారం వలన వంట చేయాల్సిన భారాన్ని తగ్గించి, అంగన్వాడీ ఉపాధ్యాయులు ఇతర కార్యకలాపాలపై ఎక్కువ దృష్టిని కేంద్రీకరించవచ్చు. ఇప్పటికే అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలులోనే ఉంది, అని ప్రభుత్వం తెలిపింది.

#ChildNutrition#HealthyKids#EarlyChildhoodDevelopment#TGGovernment#NewYearInitiative#8లక్షలపిల్లలు#TelanganaNews

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version