Business

మీ వాట్సాప్, ఇ-మెయిల్ అకౌంట్లపై ఐటీ శాఖ కన్ను?

 ఏప్రిల్ 1, 2026 నుండి అమలులోకి రానున్న కొత్త ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 247 ద్వారా ఐటీ అధికారులకు ‘సూపర్ పవర్స్’ వస్తున్నాయని, వారు ట్యాక్స్ పేయర్ల వ్యక్తిగత సోషల్ మీడియా ఖాతాలను తనిఖీ చేస్తారని వస్తున్న వార్తలపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది.

సూపర్ పవర్స్ లేవు: సెక్షన్ 247 ద్వారా ట్యాక్స్ పేయర్ల డిజిటల్ స్పేస్‌ను (వాట్సాప్, ఫేస్‌బుక్, ఇ-మెయిల్స్) ఇష్టానుసారంగా యాక్సెస్ చేసే అపరిమిత అధికారాలు ఐటీ శాఖకు కల్పించలేదని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరీ స్పష్టం చేశారు.

పాత చట్టానికే సవరణ: 1961 నాటి పాత ఐటీ చట్టంలోని సెక్షన్ 132 స్థానంలోనే ఈ కొత్త సెక్షన్ 247 వస్తోంది. ఇది కేవలం సోదాలు (Searches), జప్తులకు (Seizures) సంబంధించిన పాత నిబంధనలనే ప్రస్తుత సాంకేతికతకు అనుగుణంగా మార్చడం మాత్రమే.

డిజిటల్ యాక్సెస్ కోడ్: కంప్యూటర్ సిస్టమ్స్‌కు సంబంధించి యాక్సెస్ కోడ్‌లను ఓవర్‌రైడ్ చేసే అధికారం గతంలోనే ఉన్నప్పటికీ, మారుతున్న టెక్నాలజీ నేపథ్యంలో దానికి స్పష్టమైన చట్టబద్ధత కల్పించడమే ఈ సెక్షన్ ఉద్దేశం.ఈ కొత్త నిబంధనల్లో కృత్రిమ మేధస్సు (AI) ద్వారా పర్యవేక్షణ ఉంటుందనే ప్రచారాన్ని కూడా ప్రభుత్వం తోసిపుచ్చింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version