Latest Updates

పాకిస్థాన్కు ప్రధాని మోదీ తీవ్ర హెచ్చరిక: ‘రోటీ తినండి, లేదంటే బుల్లెట్ సిద్ధం

PM Modi Warning: పాక్ దాడి చేస్తే భారత్ ప్రతిదాడి మరింత బలంగా, విధ్వంసకరంగా  ఉంటుంది- అమెరికాకు తేల్చి చెప్పిన ప్రధాని మోదీ | If pakistan does something  indias ...

పాకిస్థాన్కు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరోసారి కఠిన హెచ్చరిక జారీ చేశారు. గుజరాత్లోని భుజ్‌లో జరిగిన ఒక సభలో ఆయన మాట్లాడుతూ, “మీరు రోటీ తినండి, ప్రశాంతంగా జీవించండి. లేదంటే నా బుల్లెట్ సిద్ధంగా ఉంటుంది” అని తనదైన శైలిలో పాకిస్థాన్‌ను ఉద్దేశించి హెచ్చరించారు.

పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోందని ఆరోపిస్తూ, మోదీ తీవ్ర విమర్శలు గుప్పించారు. “భారతదేశం టూరిజంపై ఆధారపడుతోంది. టూరిజం ప్రజలను ఒకచోటికి చేర్చి, సామరస్యాన్ని పెంపొందిస్తుంది. కానీ పాకిస్థాన్ వంటి దేశం ఉగ్రవాదాన్ని (టెర్రరిజం) టూరిజంలా భావిస్తోంది. ఇది ప్రపంచానికి పెను ముప్పుగా మారింది” అని ఆయన పేర్కొన్నారు. పాకిస్థాన్ ఉగ్రవాద కార్యకలాపాలపై భారతదేశం ఎల్లప్పుడూ గట్టిగా స్పందిస్తుందని మోదీ ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version