International

గ్రీస్‌లో భారీ భూకంపం: సునామీ హెచ్చరికలు జారీ

మరియు న్యూజిలాండ్ మధ్య రెండు భూకంపాలు సంభవించాయి, సునామీ హెచ్చరిక జారీ  చేయబడలేదు

గ్రీస్‌లోని క్రీట్ ద్వీపం తీర ప్రాంతంలో బుధవారం భారీ భూకంపం సంభవించింది, దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.1గా నమోదైందని యూఎస్ జియోలాజికల్ సర్వే (USGS) తెలిపింది. ఈ భూకంపం భూమి ఉపరితలం నుండి 77 కిలోమీటర్ల లోతులో సంభవించినట్లు అధికారులు గుర్తించారు. ఈ ఘటనతో సునామీ ప్రమాదం ఉందని భావించిన స్థానిక అధికారులు ముందస్తు హెచ్చరికలు జారీ చేశారు. ప్రజల భద్రత కోసం ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్‌లను రంగంలోకి దింపి, సహాయక చర్యలను వేగవంతం చేశారు.

ప్రస్తుతం ఈ భూకంపం వల్ల ఆస్తి నష్టం లేదా ప్రాణ నష్టం జరిగినట్లు ఎలాంటి అధికారిక సమాచారం అందలేదు. అయితే, సునామీ హెచ్చరికల నేపథ్యంలో తీర ప్రాంతాల్లో నివసించే ప్రజలను అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. క్రీట్ ద్వీపం గతంలో కూడా భూకంపాలకు గురైన చరిత్ర ఉన్నందున, ఈ ఘటన స్థానికుల్లో ఆందోళన రేకెత్తించింది. అధికారులు పరిస్థితిని సమీక్షిస్తూ, సునామీ ప్రభావం మరియు నష్టం గురించి మరిన్ని వివరాలను సేకరిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version