Business

కాన్పుర్ మెట్రో ప్రాజెక్ట్‌లో రూ.80 కోట్ల బకాయిలు: తుర్కియే సంస్థ గులెర్మాక్ పరారీ

ఏప్రిల్ 24న కొత్త కాన్పూర్ మెట్రో స్టేషన్లను ప్రధాని మోదీ  ప్రారంభించనున్నారు, ఏర్పాట్లను సీఎం యోగి సమీక్షించారు.

ఉత్తరప్రదేశ్‌లోని కాన్పుర్ మెట్రో ప్రాజెక్ట్‌లో అండర్‌గ్రౌండ్ నిర్మాణ పనులు చేపట్టిన తుర్కియేకు చెందిన గులెర్మాక్ సంస్థ కాంట్రాక్టర్లకు షాకిచ్చింది. ఈ సంస్థ రూ.80 కోట్ల బకాయిలను చెల్లించకుండా నగరం నుంచి పరారైనట్లు తెలుస్తోంది.

కాన్పుర్ మెట్రో ప్రాజెక్ట్‌లో భాగంగా అండర్‌గ్రౌండ్ మెట్రో నిర్మాణం కోసం గులెర్మాక్ సంస్థ పనిచేస్తోంది. అయితే, 53 మంది కాంట్రాక్టర్లకు సుమారు రూ.80 కోట్ల బకాయిలను చెల్లించకుండా సంస్థ అధికారులు నగరం నుంచి పారిపోయినట్లు కాంట్రాక్టర్లు ఆరోపిస్తున్నారు. ఫోన్‌లో సంప్రదించినప్పుడు సరైన స్పందన లేకపోవడంతో కాంట్రాక్టర్లు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఈ విషయమై ఉత్తరప్రదేశ్ మెట్రో రైల్ కార్పొరేషన్ (UPMRC) అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ, ఎటువంటి చర్యలు తీసుకోలేదని కాంట్రాక్టర్లు తెలిపారు. దీంతో, తొమ్మిది మంది కాంట్రాక్టర్ల ప్రతినిధులు జిల్లా మేజిస్ట్రేట్ (DM) కార్యాలయాన్ని సంప్రదించి, లిఖితపూర్వక ఫిర్యాదు సమర్పించారు. ఈ ఘటన స్థానిక కాంట్రాక్టర్లలో ఆందోళన రేకెత్తించడంతో పాటు, ప్రాజెక్ట్ నిర్వహణపై పలు ప్రశ్నలను లేవనెత్తుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version