Andhra Pradesh

అల్లు అర్జున్ కుటుంబంలో విషాదం

నిర్మాత అల్లు అరవింద్ ఇంట తీవ్ర విషాదం

మెగా, అల్లు కుటుంబంలో శోకం నెలకొంది. అల్లు అరవింద్ తల్లి, ప్రముఖ నటుడు అల్లు రామలింగయ్య గారి సతీమణి కనకరత్నం (94) వృద్ధాప్య సమస్యల కారణంగా ఇవాళ అర్ధరాత్రి 1.45 గంటలకు కన్నుమూశారు.

ఈ వార్త తెలిసిన వెంటనే అల్లు అర్జున్ ముంబై నుంచి హైదరాబాదుకు బయల్దేరగా, చిరంజీవి అల్లుడు రామ్ చరణ్ మైసూరు నుంచి హైదరాబాదుకు చేరుకుంటున్నారు.

కనకరత్నం గారు చిరంజీవి గారికి అత్త కాగా, రామ్ చరణ్‌కి అమ్మమ్మ అవుతారు. ఆమె అంత్యక్రియలు ఇవాళ మధ్యాహ్నం కోకాపేటలో నిర్వహించనున్నారు.

కుటుంబ సభ్యులు, అభిమానులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version