Connect with us

Andhra Pradesh

పనికిరాని వస్తువులు పారేయొద్దు.. తీసుకొస్తే నగదు చేతికే!

డిజిటలీకరణ వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో మొబైల్ ఫోన్లు, కంప్యూటర్లు, టీవీలు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాల వినియోగం విపరీతంగా పెరిగింది.

డిజిటలీకరణ వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో మొబైల్ ఫోన్లు, కంప్యూటర్లు, టీవీలు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాల వినియోగం విపరీతంగా పెరిగింది. అదే సమయంలో పాడైపోయిన ఈ పరికరాల వల్ల ఏర్పడుతున్న ఈ-వేస్ట్ (ఎలక్ట్రానిక్ వ్యర్థాలు) పర్యావరణానికి పెద్ద సవాలుగా మారింది. ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ఆంధ్రప్ర

పాడైన ఎలక్ట్రానిక్ పరికరాల్లో ఉండే లెడ్, కాడ్మియం, మెర్క్యురీ వంటి విషపదార్థాలు నేలలో, నీటిలో కలిసిపోవడంతో తీవ్ర పర్యావరణ కాలుష్యం ఏర్పడుతోంది. పట్టణాలతోపాటు గ్రామాల్లో కూడా ఈ సమస్య క్రమంగా పెరుగుతోంది. భవిష్యత్తులో ప్రధాన నగరాల్లో ఏటా లక్షల టన్నుల మేర ఈ-వేస్ట్ ఉత్పత్తి అయ్యే అవకాశం ఉందన్న అంచ

ఈ నేపధ్యంలో, రాష్ట్రవ్యాప్తంగా ఈ-వ్యర్థాల సేకరణ, పునర్వినియోగానికి ఏపీ ప్రభుత్వం ముందడుగు వేసింది. హైదరాబాద్‌కు చెందిన ‘ఆర్‌ఈ సస్టెయిన్‌బిలిటీ – రెల్డన్ రిఫైనింగ్’ సంస్థతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. అటువంటి భాగస్వామ్యంతో రాష్ట్రంలోని నగరాలు, పట్టణాల్లో దశలవారీగా ఈ-వేస్ట్ సేకరణ కేంద్రాలు ఏ

ఇలాంటి కేంద్రాల ద్వారా ఇళ్లు, దుకాణాల్లో, కార్యాలయాల్లో ఉపయోగం లేకుండా ఉన్న మొబైల్ ఫోన్లు, కంప్యూటర్లు, కేబుళ్లు, ఎలక్ట్రానిక్ విడిభాగాలను సేకరిస్తున్నారు. అనంతరం వీటిని పర్యావరణానికి హాని కలగకుండా శాస్త్రీయ పద్ధతుల్లో రీసైక్లింగ్ చేస్తున్నారు. ఈ-వేస్ట్ నిర్వహణకు సంబంధించి ఇప్పటికే ప్రభుత

The government, after starting this scheme on an experimental basis four months ago in 46 cities, has decided to extend the e-waste management in the jurisdiction of as many as 132 urban local bodies very shortly.

ఈ-వేస్ట్ ఇస్తే… డబ్బులు!

ఈ కార్యక్రమంలో ప్రజలను భాగస్వాముల్ని చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. అందులో భాగంగా సేకరణ కేంద్రాలకు ప్రజలు స్వయంగా ఈ-వ్యర్థాలను తీసుకొస్తే, వాటికి ధర నిర్ణయించి నగదు చెల్లించే విధానాన్ని పరిశీలిస్తోంది. ఇలా చేయడం వల్ల ఇళ్లు, షాపుల్లో ఉన్న పాడైన ఎలక్ట్రానిక్ వస్తువులు చెత్తగా మారకుండా సరైన మార

ఈ-వేస్ట్ సేకరణను సులభతరం చేయడానికి ప్రత్యేకంగా ఒక మొబైల్ యాప్ తీసుకురావాలని ప్రభుత్వ యోచిస్తోంది. అందులో వ్యర్థాల వివరాలు నమోదు చేస్తే, సేకరణ కేంద్రాల సిబ్బంది నేరుగా ఇంటికే వచ్చి ఈ-వేస్ట్ తీసుకుని, నగదు చెల్లించే విధానాన్ని అమలు చేసే అవకాశం ఉందని సమాచారం.

మొత్తానికి ఈ-వేస్ట్ సమస్యను అవకాశంగా మార్చి పర్యావరణ పరిరక్షణతో పాటు ప్రజలకు లాభం చేకూర్చే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక అడుగు వేసిందని చెప్పవచ్చు.

Loading