Connect with us

Politics

ఎప్పటికీ గుర్తుండిపోయేలా తెలంగాణలో కొత్త అధ్యాయం..!

తెలంగాణ

తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన “తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025” నేడు విశేషంగా ప్రారంభంకానుంది. సీఎం రేవంత్ రెడ్డి విజన్‌కు అద్దం పట్టే ఈ రెండు రోజుల సదస్సు ద్వారా రాష్ట్రంలోని విస్తారమైన పెట్టుబడి అవకాశాలను ప్రపంచానికి తెలియజేసి, యువతకు మరిన్ని ఉపాధి అవకాశాలను సృష్టించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. ఈ నేపథ్యంలో భారత్ ఫ్యూచర్ సిటీ లో అద్భుతమైన ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు ఆతిథులందరినీ ఆకట్టుకునేలా వేదికను సిద్ధం చేశారు.

44 కంటే ఎక్కువ దేశాల నుంచి 154 మంది అంతర్జాతీయ ప్రతినిధులు ఈ మహాసదస్సుకు హాజరవుతున్నారు. ఖ్యాతిగాంచిన పలు గ్లోబల్ కంపెనీల టాప్ ఎగ్జిక్యూటివ్‌లు పాల్గొనడం విశేషం. అమెరికా నుంచే 46 మంది పారిశ్రామిక నేతలు, మల్టీనేషనల్ సంస్థల ప్రతినిధులు హైదరాబాద్‌కు చేరుకుంటున్నారు. మధ్యాహ్నం 1:30 గంటలకు గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ సమ్మిట్‌ను అధికారికంగా ప్రారంభించనున్నారు. దేశ–విదేశాల నుంచి సుమారు రెండు వేల మంది ప్రతినిధులు ఈ ఘన వేడుకను ప్రత్యక్షంగా వీక్షించనున్నారు.

సదస్సు మొదటి రోజున పలు అంతర్జాతీయ ప్రముఖులు తమ విలువైన అభిప్రాయాలను వెల్లడించేందుకు సిద్ధమయ్యారు. నోబెల్ అవార్డు గ్రహీత అభిజిత్ బెనర్జీ, ట్రంప్ మీడియా టెక్నాలజీ సీఈఓ ఎరిక్ స్వైడర్, వరల్డ్ ఎకనామిక్ ఫోరం సీఈవో జెరెమీ జుర్గెన్స్, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత కైలాష్ సత్యార్థి, బయోకాన్ చైర్‌పర్సన్ కిరణ్ మజుందార్ షా వంటి దిగ్గజాలు తొలి రోజు వేదికపై కనిపించనున్నారు.

మధ్యాహ్నం 2:30 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ప్రసంగం ఇస్తారు. తెలంగాణలో ప్రజా పరిపాలనలో వస్తున్న మార్పులు, పెట్టుబడులకి అనుకూల వాతావరణం, ప్రభుత్వ మద్దతు విధానాలు, విజన్ 2047 లక్ష్యాలు, అలాగే భారత్ ఫ్యూచర్ సిటీ ద్వారా లభించే విస్తృత అవకాశాలను ఆయన వివరిస్తారు. మొత్తం రెండు రోజులలో 27 వివిధ అంశాల

అత్యాధునిక సాంకేతికతతో పరిశోభింపజేసిన సమ్మిట్ వేదిక మరో ఆకర్షణ. ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి ప్రత్యేక సంగీత కచేరీతో అతిథులను అలరించనున్నారు. అదనంగా కొమ్ము కోయ, బంజారా, గుస్సాడీ, ఒగ్గు డొల్లు, పేరిణి, బోనాలు వంటి తెలంగాణ సాంప్రదాయ కళారూపాలతో సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు.

అంతేగాకుండా నాగార్జునసాగర్ సమీపంలోని ప్రపంచంలోనే అతిపెద్ద బౌద్ధ వారసత్వ థీమ్ పార్క్ బుద్ధవనం ను సందర్శించేందుకు దౌత్య ప్రతినిధులకు ప్రత్యేక పర్యటనను పర్యాటక శాఖ ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమం తెలంగాణ సంస్కృతి, అభివృద్ధి దిశలో రాష్ట్రం వేస్తున్న ముందడుగును ప్రపంచం ఎదుట ప్రతిష్ఠాత్మకంగా నిలబెడుతోంది.

#TelanganaRising2025#GlobalSummit2025#RevanthReddy#TelanganaDevelopment#BharatFutureCity#HyderabadEvents#GlobalInvestments
#TelanganaNews#InternationalSummit#AbhijitBanerjee#MMKeeravani#Buddhavanam#HyderabadUpdates

Loading

Continue Reading
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *