Andhra Pradesh
వైసీపీ నేతలకు జగన్ కీలక దిశానిర్దేశం: భవిష్యత్ కార్యాచరణపై చర్చ

ఆంధ్రప్రదేశ్లో రాజకీయ వేడి చల్లారని వైసీపీ చీఫ్, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కీలక చర్యలకు శ్రీకారం చుట్టారు. పార్టీ నేతలతో ఆయన నిర్వహిస్తున్న అత్యవసర సమీక్షా సమావేశంలో తాజా రాజకీయ పరిణామాలు, నేతల అరెస్టులు, అధికార పార్టీ వైఫల్యాలు, “సూపర్-6” పథకాల అమలుపై సమగ్ర చర్చ జరుగుతోంది.
ఈ సమావేశానికి రాష్ట్రవ్యాప్తంగా 175 నియోజకవర్గాల ఇన్ఛార్జులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, జిల్లా అధ్యక్షులు, రీజనల్ కోఆర్డినేటర్లు, పార్టీ పరిశీలకులు హాజరయ్యారు. పార్టీ పునరుద్ధరణ, ప్రజలతో మళ్లీ అనుబంధం ఏర్పరచుకోవాలన్న లక్ష్యంతో జగన్ భవిష్యత్తు కార్యాచరణపై నేతలకు స్పష్టమైన మార్గదర్శకాలు అందిస్తున్నారు.
![]()
