Latest Updates

హైదరాబాద్‌లో ఘోర ప్రమాదం: టోలీచౌకీలో ఐదు అంతస్తుల భవనం కూలి నలుగురు మృతి!

భాగ్యనగరంలోని టోలీచౌకీ అల్ హస్నాత్ కాలనీలో గురువారం ఈ దుర్ఘటన జరిగింది. నిర్మాణంలో ఉన్న ఓ భారీ భవనం ఒక్కసారిగా కూలిపోవడంతో అక్కడే పనిచేస్తున్న కార్మికులపై భవన శిథిలాలు పడ్డాయి.భవనం కూలిన సమయంలో పనుల్లో నిమగ్నమైన నలుగురు కార్మికులు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. మరికొందరు శిథిలాల కింద చిక్కుకోగా, వారిని అధికారులు రక్షించారు.

కొత్తగా నిర్మిస్తున్న భవనానికి గోవా కర్రలతో సపోర్ట్ కట్టి, వాటిపై నిలబడి పనులు చేస్తుండగా.. ఒక్కసారిగా ఆ కర్రలు విరిగిపోయి ఐదు అంతస్తుల నిర్మాణం కుప్పకూలిందని ప్రాథమిక సమాచారం.ఈ ప్రమాదంలో గాయపడిన మరికొంత మంది పరిస్థితి విషమంగా ఉంది. వారిని హుటాహుటిన సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. క్షతగాత్రుల్లో కొందరి పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.

సహాయక సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, జీహెచ్‌ఎంసీ (GHMC) అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాలను తొలగించి ఎవరైనా చిక్కుకున్నారేమోనని గాలిస్తున్నారు.పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిర్మాణంలో ఏవైనా భద్రతా లోపాలు ఉన్నాయా అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. మృతులకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version