Latest Updates

భరతనాట్యంతో మెప్పించిన చైనీస్ యువతి

భారత ప్రాచీన నృత్యకళ భరతనాట్యంకు చైనాలో అరుదైన గౌరవం దక్కింది. కేవలం 17 ఏళ్ల చైనీస్ యువతి జాంగ్ జియా యువాన్ తన భరతనాట్య ప్రదర్శనతో ప్రేక్షకులను అబ్బురపరిచింది.

బీజింగ్‌లో జరిగిన తన అరంగేట్ర నృత్యం ద్వారా జియా అందరి దృష్టిని ఆకర్షించారు. చిన్నప్పటి నుంచే భారతీయ నృత్యాలపై ఆసక్తి కలిగిన ఆమె, నిరంతర సాధనతో ఈ స్థాయికి చేరుకున్నారు. ముఖ్యంగా ప్రఖ్యాత చైనీస్ భరతనాట్య నృత్యకారిణి జిన్ షాన్ వద్ద శిక్షణ పొంది తన ప్రతిభను మెరుగుపరుచుకున్నారు.

జియాకు లభించిన ఈ ప్రశంసలు భారతీయ సంస్కృతికి, ప్రత్యేకంగా భరతనాట్యానికి ప్రపంచవ్యాప్తంగా ఏర్పడుతున్న గౌరవాన్ని స్పష్టంగా చూపిస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version