Telangana

మరో ప్రాంతం కరీంనగర్‌లో కలవనుందా? మంత్రి వ్యాఖ్యలతో చర్చ

తెలంగాణలో జిల్లాల పునర్వ్యవస్థీకరణ అంశం మళ్లీ రాజకీయ వేదికపైకి వచ్చింది. గత ప్రభుత్వ హయాంలో ప్రజల అవసరాలు, భౌగోళిక పరిస్థితులను పక్కనపెట్టి చేపట్టిన జిల్లాల విభజన వల్ల తలెత్తిన సమస్యలను సరిచేయడానికి ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కసరత్తు చేస్తోందని సంకేతాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో హుస్

హుస్నాబాద్ ఉర్బన్ పార్క్‌కు శంకుస్థాపన పనులు జరిపించిన సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వం ప్రజల అభీష్టానికి విరుద్ధంగా హుస్నాబాద్‌ను సిద్దిపేట జిల్లాలో విలీనం చేసిందని విమర్శించారు. హుస్నాబాద్‌కు చారిత్రకంగా, పరిపాలనా పరంగా కరీంనగర్‌తోనే విడదీయలేని అనుబంధ

రెవిన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అసెంబ్లీ వేదికగా చేసిన ప్రకటనతో ఈ అంశానికి మరింత బలం చేకూరింది. గతంలో రాజకీయ ప్రయోజనాల కోసం ఏర్పాటు చేసిన చిన్న జిల్లాల వల్ల పాలన క్లిష్టంగా మారిందని ప్రభుత్వం భావిస్తోంది. జనాభా, విస్తీర్ణం, ప్రజలకు అందుబాటు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని జిల్లాల ప

హుస్నాబాద్‌తో పాటు రాష్ట్రవ్యాప్తంగా అశాస్త్రీయంగా విడిపోయిన మండలాలను తిరిగి పాత జిల్లాల్లో విలీనం చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తులు అందుతున్నాయి. మున్సిపల్ ఎన్నికలకు ముందే ఈ అంశంపై స్పష్టమైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉందన్న అంచనాలు వినిపిస్తున్నాయి.

అదే సమయంలో, మాజీ ప్రధాని పి.వి. నరసింహారావు జన్మస్థలం వంగరను కేంద్రంగా చేసుకుని ఆయన పేరుతో కొత్త జిల్లా ఏర్పాటు చేయాలన్న డిమాండ్ కూడా ఊపందుకుంది. హుజూరాబాద్ సహా సమీప ప్రాంతాలను కలిపి ‘పి.వి. నరసింహారావు జిల్లా’ ప్రకటించాలని కోరుతూ పలు ప్రాంతాల్లో ధర్నాలు, ఆందోళనలు కొనసాగుతున్నాయి.

జిల్లాల పునర్వ్యవస్థీకరణ ప్రక్రియ ప్రారంభమైతే హుస్నాబాద్ మార్పు కేవలం ఆరంభమేనని, రానున్న రోజుల్లో తెలంగాణ పరిపాలనా పటంలో గణనీయమైన మార్పులు చోటు చేసుకునే అవకాశముందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

#Husnabad#KarimnagarDistrict#DistrictReorganisation#TelanganaPolitics#CongressGovernment#PonnamPrabhakar
#PonguletiSrinivasReddy#PVNarasimhaRao#NewDistrictDemand#TelanganaNews#PoliticalDebate#AdministrativeReforms

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version