Education

ప్రధానితో ముఖాముఖి మాట్లాడే అవకాశం..! విద్యార్థులకు గోల్డెన్ ఛాన్స్, ఇలా చేసుకోవాలి

ప్రధాని నరేంద్ర మోదీతో నేరుగా మాట్లాడే అవకాశం విద్యార్థులకు ఉంది. ‘పరీక్షా పే చర్చా’ అనే కార్యక్రమంలో పాల్గొని, పరీక్షల గురించి, భవిష్యత్ లక్ష్యాల గురించి, ఏకాగ్రత పెంచుకోవడం గురించి మీ ప్రశ్నలను ప్రధానితో ప్రత్యక్షంగా అడగవచ్చు. 6వ తరగతి నుండి 12వ తరగతి వరకు చదువుతున్న ప్రతి విద్యార్థి ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చు.

రిజిస్ట్రేషన్ కోసం innovateindia.mygov.in

వెబ్‌సైట్‌ను సందర్శించండి. మీ పేరు, ఫోన్ నంబర్ మరియు పాఠశాల వివరాలను నమోదు చేయండి. 5 బహుళైచ్ఛిక ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వండి. ఆ తర్వాత, ప్రధానిని అడగాలనుకున్న ప్రశ్నను 500 అక్షరాల లోపల ఆసక్తికరంగా సమర్పించండి. ఎంపిక చేయబడిన విద్యార్థులు ప్రధానితో ముఖాముఖి సమావేశంలో పాల్గొనవచ్చు. వారు ప్రత్యేక పీపీసీ కిట్‌ని పొందవచ్చు. వారు ప్రధాని మోదీ రాసిన ‘ఎగ్జామ్ వారియర్స్’ పుస్తకాన్ని బహుమతిగా పొందవచ్చు.

ఈ కార్యక్రమం విద్యార్థులకు పరీక్షల ఒత్తిడి తగ్గించడానికి, విజేతలుగా ఎదగడానికి ప్రేరణనిస్తుంది. రిజిస్ట్రేషన్ గడువు ఈ నెల 11వ తేదీ. వెంటనే మీ పేరు నమోదు చేసి, ఈ అరుదైన అవకాశం పొందండి.

#ParikshaPeCharcha2026 #PMModiWithStudents #FaceToFaceWithPM #StudentMotivation #ExamWarriors #InnovateIndia #PMModiLive #EducationForFuture #StudentOpportunity #AcademicGuidance #DirectInteractionWithPM #IndiaEducation #ExamTipsFromPM #StudentEmpowerment #6thTo12thStudents

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version