Andhra Pradesh

ఈ నెల 5న కోటి మొక్కలు నాటాలి: చంద్రబాబు

Andhra Pradesh Chief Minister launches one-crore sapling plantation drive  at Vanamahotsavam - The Hindu

అమరావతి: జూన్ 5వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోటి మొక్కలు నాటే భారీ కార్యక్రమాన్ని చేపట్టాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్లు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు అందరూ చురుకుగా పాల్గొనాలని ఆయన సూచించారు. రాష్ట్రంలో పచ్చదనాన్ని పెంచేందుకు ఈ కార్యక్రమం కీలకమని, అందరి సహకారంతో దీన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. బస్టాండ్లు, రోడ్ల పక్కన, విద్యా సంస్థలు, ఆస్పత్రులు, ప్రభుత్వ కార్యాలయాల వద్ద మొక్కలు నాటాలని ఆయన ఆదేశించారు.

ప్రస్తుతం రాష్ట్రంలో 30.5 శాతం ఉన్న పచ్చదనాన్ని 2047 నాటికి 50 శాతానికి పెంచాలనే లక్ష్యంతో కార్యాచరణ రూపొందించాలని చంద్రబాబు నిర్దేశించారు. ఈ లక్ష్యాన్ని సాధించేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు అందరూ కలిసి కృషి చేయాలని ఆయన పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఈ కార్యక్రమం రాష్ట్రానికి దీర్ఘకాలిక ప్రయోజనాలను అందిస్తుందని, అందుకే అందరూ బాధ్యతాయుతంగా పాల్గొనాలని సీఎం కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version