International

అమెరికాలో కన్జర్వేటివ్ యాక్టివిస్ట్ ఛార్లీ కిర్క్ హత్య

Charlie Kirk: డొనాల్డ్ ట్రంప్‌ సన్నిహితుడు కన్జర్వేటివ్ యాక్టివిస్ట్‌పై హత్య

అమెరికా రాజకీయ వర్గాలను కుదిపేసే సంఘటన చోటుచేసుకుంది. కన్జర్వేటివ్ యాక్టివిస్టు, టర్నింగ్ పాయింట్ యూఎస్ఏ (Turning Point USA) వ్యవస్థాపకుడు ఛార్లీ కిర్క్ (31) కాల్పుల్లో హత్యకు గురయ్యారు. అమెరికా వ్యాప్తంగా రైటిస్టు భావజాలాన్ని బలంగా ప్రచారం చేస్తూ గుర్తింపు పొందిన కిర్క్, యువతలో ప్రత్యేకంగా ప్రభావం చూపిన వ్యక్తిగా భావిస్తారు. కాల్పులు జరిగిన ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఛార్లీ కిర్క్ కేవలం 18 ఏళ్ల వయసులోనే టర్నింగ్ పాయింట్ యూఎస్ఏ అనే ఎన్జీవోను స్థాపించారు. ఈ సంస్థ ప్రధానంగా కన్జర్వేటివ్ ఆలోచనలను యువతలో వ్యాప్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది. 2020, 2024 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విజయానికి కిర్క్ కీలకంగా పనిచేసినట్టు రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. కిర్క్ తన ఆలోచనలను నేరుగా, ఎలాంటి సంకోచం లేకుండా వినిపించే వ్యక్తిగా పేరుపొందారు.

అమెరికా అంతటా ఉన్న యూనివర్సిటీల్లో డిబేట్లు నిర్వహిస్తూ, విద్యార్థుల ప్రశ్నలకు నేరుగా సమాధానమిచ్చి ఆయన మంచి ఫాలోయింగ్ సంపాదించారు. ఆయన మరణంతో అమెరికా రాజకీయ వర్గాలు షాక్‌కు గురయ్యాయి. రిపబ్లికన్ పార్టీకి అనుకూలంగా, కన్జర్వేటివ్ ఆలోచనలతో పని చేసిన ఈ యువ నేత మరణం రాబోయే ఎన్నికల వాతావరణంపై కూడా ప్రభావం చూపే అవకాశముందని విశ్లేషకులు భావిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version