Connect with us

Telangana

గుడిలో ప్రదక్షిణలు చేస్తూ గుండెపోటు.. దేవుడి సన్నిధిలోనే మరణించాడు..

మనిషి జీవితం నీటి బుడగ లాంటింది. ఎప్పుడు ఎటువైపు నుంచి మృత్యువు దూసుకొస్తుందో ఎవరూ ఊహించలేరు. అప్పటివరకు ఆనందంగా, సంతోషంగా ఉన్నవారు అకస్మాత్తుగా ప్రాణాలు కోల్పోతున్న సంఘటనలు ఎన్నో ఉన్నాయి. నడుస్తూ.. నవ్వుతూ.. ఆడుతూ.. పాడుతూ ఇలా అప్పటిదాక అందరితో సరదాగా గడిపినవారు క్షణాల్లోనే గుండెపోటుకు గురై ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా, హైదరాబాద్ కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డు కాలనీలో విషాదం జరిగింది. గుడిలో ప్రదక్షిణలు చేస్తూ ఓ యువకుడు గుండెపోటుతో మృతి చెందాడు. అందరూ చూస్తుండగానే దేవుని సన్నిధిలోనే మృత్యు ఒడికి చేరుకున్నాడు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం విష్ణువర్ధన్ అనే యువకుడు KPHB రోడ్ నెంబర్ 1లోని ఓ ప్రైవేటు హాస్టల్‌లో ఉంటున్నాడు. స్థానికంగా ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్న విష్ణువర్ధన్‌.. ప్రతిరోజు వీరాంజనేయ స్వామి ఆలయానికి వెళ్లి పూజలు చేస్తుంటాడు. ఈ క్రమంలోనే ఇవాళ ఉదయం ఆలయంలో ప్రదక్షిణలు చేసేందుకు సిద్ధమయ్యాడు. గుడిలో ప్రదక్షిణలు చేస్తుండగా, విష్ణుకు అలసటతో కొంచెం నొప్పి అనిపించింది. దీంతో ఆలయంలో ఉన్న ఓ వాటర్ ఫిల్టర్ వద్దకు వెళ్లి మంచినీరు తాగాడు. అనంతరం తిరిగి మళ్లీ ప్రదక్షిణలు ప్రారంభించాడు.

ఈ క్రమంలో ఒక్కసారిగా గుండెపోటుకు గురై దేవ సన్నధిలోనే కుప్పకూలిపోయాడు. తోటి భక్తులు మరియు ఆలయ అర్చకులు విష్ణువ్వి పూజలు చేశారు. కానీ చలనం లేకపోవడంతో, వెంటనే 108 అంబులెన్సు ద్వారా దగ్గరలోని హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. విష్ణువర్ధన్‌ను పరిశీలించిన డాక్టర్లు అప్పటికే మృతి చెందినట్లు వెల్లడించారు. విష్ణువర్ధన్ గుడిలో కుప్పకూలిన దృశ్యాలు ఆలయ సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు.

విష్ణువర్ధన్ మృతి విషయం తెలిసి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. కార్తీక మాసం కావడంతో ఉదయం దైవ దర్శనానికి వెళ్లాడని.. కానీ ఇలా గుడిలోనే విగతజీవి మారతాడని ఊహించలేకపోయామంటూ తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోధించారు. ఈ ఘటన అక్కడున్న వారిచే కంటతడి పెట్టించింది.

Advertisement

Loading

Trending