Sports
శ్రీలంకను చిత్తు చేసిన భారత్.. సెమీస్ పై ఆశలు..

మహిళల టీ20 ప్రపంచకప్ 2024 సెమీ ఫైనల్ రేసులో ఉండాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచులో భారత మహిళల జట్టు అదరగొట్టింది. బ్యాటింగ్, బౌలింగ్తో అదరగొట్టి శ్రీలంకను చిత్తు చేసింది. ఏకంగా 82 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో సెమీ ఫైనల్కు కీలకమైన నెట్రన్ రేట్ను గణనీయంగా పెంచుకుంది. దీంతో గ్రూప్-A పాయింట్ల టేబుల్లో నాలుగో స్థానం నుంచి ఏకంగా రెండో ప్లేసుకు వెళ్ళింది. ఇక ఈ టోర్నీలో భాగంగా ఈనెల 13న భారత్.. తన చివరి లీగ్ మ్యాచును ఆస్ట్రేలియాతో ఆడనుంది. ఇందులో గెలిస్తే.. భారత్ సెమీ ఫైనల్ చేరినట్లే!
ఈ మ్యాచులో టాస్ గెలిచిన భారత్కు ఓపెనర్లు షెఫాలీ వర్మ (43), స్మృతి మంధాన (50) బలమైన పునాది వేశారు. ఇద్దరికి ఇద్దరు వేగంగా పరుగులు రాబట్టడంతో భారత్.. 9 ఓవర్లు మగిసే సరికి 71/0తో దూసుకెళ్లింది. 12.4 ఓవర్లలో జట్టు స్కోరు 98 వద్ద మంధాన రనౌట్ అయింది. ఆ తర్వాత బంతికే షెఫాలీ కూడా వెనుదిరిగింది. దింతో ఆ తర్వాత బ్యాటింగ్కు వచ్చిన కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్.. పెను విధ్వంసం సృష్టించింది. కేవలం 27 బంతుల్లోనే 52 పరుగులు చేసి.. ఫినిషింగ్ టచ్ ఇచ్చింది. దీంతో భారత్ 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది.
భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక.. ఆదిలోనే చేతులెత్తేసింది. సూపర్ ఫామ్ లో ఉన్న కెప్టెన్ చమరి ఆటపట్టు తో సహా టాప్ ఆర్డర్ బ్యాటర్లు చేతులెతేశారు. దీంతో 6 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది శ్రీలంక. ఆ తర్వాత అనుష్క సంజీవని (20), కవి దిల్హారీ (21), అమా కాంచన్ (19) కొంచెం పోరాడటంతో తక్కువ స్కోరుకే ఆలౌట్ అయ్యే ప్రమాదం నుంచి శ్రీలంక తప్పించుకుంది. చివరకు 19.5 ఓవర్లలో 90 పరుగులకు కుప్పకూలింది. 82 పరుగుల తేడాతో భారత్ విజయం సాధించింది.
శ్రీలంకపై విజయంతో భారత్ పాయింట్ల టేబుల్ లో రెండో స్థానానికి చేరింది. ఇక టీమిండియా తన తర్వాత మ్యాచులో అక్టోబర్ 13న డిఫెండింగ్ ఛాంపియన్ అయినా ఆస్ట్రేలియాతో తలడనుంది. ఆ జట్టు ప్రస్తుతం గ్రూప్-ఏలో అగ్రస్థానంలో ఉంది. ఆ జట్టు దాదాపు సెమీస్ చేరినట్లే. ఇక మరో ప్లేస్ కోసం భారత్తో పాటు న్యూజిలాండ్, పాకిస్థాన్ కూడా పోటీలో ఉన్నాయి. దాంతో కేవలం మ్యాచ్ గెలవడం మాత్రమే కాకుండా నెట్ రన్ రేట్ కూడా కీలకంగా మారనుంది. ఈ నేపథ్యంలో గ్రూప్-A సెమీఫైనల్ రేసు ఆసక్తికరంగా మారింది.
-
Devotional9 months ago
ఖైరతాబాద్ మహా గణపతి: 70 ఏళ్లు.. 70 అడుగులు
-
Entertainment8 months ago
శేఖర్ బాష మరియు మణికంట మధ్యలో మాటల యుద్ధం | Bigboss |Telugu Biggboss Season8 | Day 4 | Nagarjuna
-
Devotional8 months ago
Lalbaugcha Raja: 10 రోజుల్లోనే గణేషుడికి కోట్ల సంపద..
-
Politics7 months ago
విజయ్పై డీఎంకే, అన్నాడీఎంకే సంచలన వ్యాఖ్యలు ఆయన కాపీరాయుడు