Andhra Pradesh
విశాఖపట్నంలో రూ.500 కోట్లతో కొత్త హోటల్.. వరుణ్గ్రూప్ సంస్థ!

విశాఖపట్నంలో కొత్త హోటల్ని ఏర్పాటు చేయడానికి మరొక సంస్థ ముందుకొచ్చింది. వరుణ్గ్రూప్ నగరంలో రూ.500 కోట్లతో హోటల్ నిర్మించబోతున్నట్లు ప్రకటించింది. ఈ ప్రకటనను వరుణ్ గ్రూప్ ఛైర్మన్ ప్రభు కిషోర్ చేశారు. ప్రస్తుతం నగరంలో ఉన్న ‘ది గేట్వే’ హోటల్ను కూల్చి, దాని స్థానంలో మూడు భారీ టవర్లను నిర్మించనున్నట్లు చెప్పారు. ఈ ప్రాజెక్టు విశాఖపట్నంలో పోర్టులు, భోగాపురం ఎయిర్పోర్టు, ఐటీ, పర్యాటకం, నౌకాదళం, విద్య రంగాల్లో జరుగుతున్న అభివృద్ధిని చూసుకొని నిర్మించబడుతుంది.
ప్రభు కిషోర్ మాట్లాడుతూ, ఈ మూడు టవర్ల నిర్మాణం సింగపూర్లోని మెరైన్ బే సాండ్స్ హోటల్ వంటి విధంగా ఉంటుంది. కొత్త హోటల్ నిర్మాణం పర్యాటకులు, వినియోగదారులకు మంచి అనుభవం ఇవ్వడానికి, కాలానుకూలంగా ఉంటుంది అని చెప్పారు.
ఈ హోటల్లో మొదటి టవర్లో 374 గదులు ఉండి, ఫైవ్ స్టార్ హోటల్ గా ఉంటుంది. రెండో టవర్లో సర్వీస్డ్ అపార్ట్మెంట్స్ ఉంటాయి. మూడో టవర్లో 2.80 లక్షల చదరపు అడుగుల గ్రేడ్-1 ఆఫీస్ స్పేస్ మరియు 30 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో లగ్జరీ రిటైల్ షాపులు ఉంటాయి. ఈ హోటల్లో హెలిప్యాడ్ మరియు స్విమ్మింగ్ పూల్ వంటి ప్రత్యేక ఆకర్షణలు కూడా ఉంటాయి. హోటల్ నిర్మాణం మూడు నుంచి మూడున్నరేళ్లలో పూర్తి చేయాలని నిర్ణయించారు.
ఇదిలా ఉంటే, తాజ్ గ్రూప్ కూడా విశాఖపట్నంలో హోటల్ నిర్మించడానికి ఆసక్తి చూపిస్తోంది. విశాఖపట్నం, అనకాపల్లి, భోగాపురం ప్రాంతాలలో స్థలాలను పరిశీలించారు. టాటా గ్రూప్ రాష్ట్రంలో మరో 20 హోటళ్ళను ఏర్పాటు చేయాలని భావిస్తోంది.
-
Devotional8 months ago
ఖైరతాబాద్ మహా గణపతి: 70 ఏళ్లు.. 70 అడుగులు
-
Entertainment8 months ago
శేఖర్ బాష మరియు మణికంట మధ్యలో మాటల యుద్ధం | Bigboss |Telugu Biggboss Season8 | Day 4 | Nagarjuna
-
Devotional8 months ago
Lalbaugcha Raja: 10 రోజుల్లోనే గణేషుడికి కోట్ల సంపద..
-
Politics7 months ago
విజయ్పై డీఎంకే, అన్నాడీఎంకే సంచలన వ్యాఖ్యలు ఆయన కాపీరాయుడు