Connect with us

Sports

ఐపీఎల్‌ రిటెన్షన్ రూల్స్‌ లీక్‌.. ఐదుగుర్ని రిటైన్‌ చేసుకునేందుకు ఛాన్స్‌..!

ఈ ఏడాది చివర్లో జరగనున్న ఐపీఎల్‌ 2025 వేలంపై అందరి దృష్టి నెలకొంది. ఈసారి మెగా వేలం జరగనుండటంతో రిటెన్షన్ ఆటగాళ్ల సంఖ్య, ఆర్టీఎం కార్డు వంటి వివరాలతో ఆసక్తి నెలకొంది. దీనిపై బీసీసీఐ త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో ప్రస్తుతం ఓ వార్త నెట్టింట వైరల్‌గా మారింది. ఐపీఎల్‌ మెగా వేలానికి సంభందించి రిటెన్షన్‌, ఆర్టీఎం కార్డుపై అందులో క్లియర్‌గా ఉంది.

రెండు నెలల తర్వాత జరగనున్న ఐపీఎల్ 2025 మెగా వేలంలో భాగంగా రిటెన్షన్ పాలసీని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఖరారు చేసినట్లు తెలుస్తోంది. బుధవారం అంటే ఈనెల 25న బెంగళూరు వేదికగా జరిగిన బీసీసీఐ 93వ సాధారణ సర్వసభ్య సమావేశం (ఏజీఎం) జరిగిన విషయం తెలిసిందే. ఇందులోనే ఐపీఎల్‌ రిటెన్షన్ రూల్స్‌ను ఖరారు చేసినట్లు సమాచారం. అయితే చాలా ఫ్రాంఛైజీలు పట్టుబట్టిన ఆర్టీఎం కార్డును మాత్రం తిరిగి తీసుకొచ్చేందుకు బీసీసీఐ అంగీకరించలేదని తెలుస్తోంది.

విశ్వసనీయ వర్గాల ప్రకారం.. ఐపీఎల్‌ 2025 వేలానికి సంబంధించి రిటెన్షన్‌ పాలసీపై నిర్ణయం తీసుకున్నారు. అయితే వాటిని త్వరలో అధికారికంగా బీసీసీఐ ప్రకటించనుంది. ఇక కొత్త రిటెన్షన్ పాలసీలో గరిష్టంగా ఒక్కో జట్టు ఐదుగురి ఆటగాళ్లను రిటెన్ చేసుకోవచ్చు. గత కొన్నేళ్లుగా లేనట్లుగానే ఈ సారి కూడా ఆర్టీఎం (రైట్‌ టు మ్యాచ్‌) కార్డుకు అవకాశం ఇవ్వలేదు. ఇదివరకే ఐపీఎల్‌లోని 10 ఫ్రాంఛైజీలతో బీసీసీఐ మాట్లాడేసింది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

అయితే బీసీసీఐతో జరిగిన ఫ్రాంఛైజీలు సమావేశంలో వేలంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అయినట్లు తెలుస్తోంది. కొన్ని ఫ్రాంఛైజీల యజమానులు మెగా వేలంపై ఆసక్తితో ఉన్నారు. మరికొందరు మాత్రం అవరరం లేదని చెప్పుకొస్తున్నారు వేలం కచ్చితంగా నిర్వహించాల్సి వస్తే.. కనీసం 8 మంది ఆటగాళ్లను రిటైన్ చేసుకునే అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేశాయి. కానీ బీసీసీఐ ఐపీఎల్‌కు క్రేజ్‌ తగ్గకూడదనే ఉద్దేశంతో ఇవేవి పట్టించుకోకుండా ఐదుగురు ఆటగాళ్లను రిటైన్ చేసుకునే విధంగా రూల్స్ రూపొందించినట్లు తెలుస్తోంది.

రైట్ టు మ్యాచ్ కార్డ్ (RTM)..
ఆర్టీఎమ్‌ అంటే.. ఒక ఫ్రాంఛైజీలోని ఆటగాడు వేలంలోకి వెళ్లాడనుకుందాం. అప్పుడు అతడిని మరో కొత్త ఫ్రాంఛైజీ సొంతం చేసుకుంది. అయితే అతడిని కొత్త ఫ్రాంఛైజీ ఎంత మొత్తానికి దక్కించుకుందో అంతే మొత్తాన్ని అతడి పాత ఫ్రాంఛైజీ చెల్లించి.. సదరు ఆటగాడిని సొంతం చేసుకునే అవకాశం ఉండేది. చివరిసారిగా 2018 ఐపీఎల్ మెగా వేలంలో ఆర్‌టీఎమ్ కార్డ్‌ను ఉపయోగించారు. మళ్లీ ఉపయోగించలేదు.

Advertisement

Loading

Continue Reading
Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending