Connect with us

Entertainment

ఓటీటీలోకి వచ్చేసిన గోపీచంద్ విశ్వం..

ఓటీటీలోకి వచ్చేసిన గోపీచంద్ విశ్వం..

గోపీచంద్-శ్రీనువైట్ల కాంబోలో తెరకెక్కిన విశ్వం సినిమా ఈరోజు (నవంబర్ 1) నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్‌కి వచ్చేసింది. దసరా కానుకగా థియేటర్లలో రిలీజ్ అయిన ఈ సినిమా దీపావళికి ఓటీటీకి వచ్చేసింది. ఇందులో కావ్య థాపర్ హీరోయిన్‌గా నటించింది.

అయితే థియేటర్లో పెద్దగా ఆకట్టుకోలేకపోయిన ఈ చిత్రం ఓటీటీలో మంచి స్పందన దక్కించుకునే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ సినిమాలో శ్రీనువైట్ల మార్క్ కామెడీ ట్రాక్స్ బాగున్నాయని ఆడియన్స్ టాక్ ఇచ్చారు.

చాలా ఏళ్లుగా ఒక మంచి హిట్ కోసం శ్రీనువైట్ల ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. 2018లో రవితేజతో ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ చిత్రాన్ని తీసిన శ్రీనువైట్ల ఆ సినిమా రిజల్ట్ కారణంగా దాదాపు ఆరేళ్ల పాటు సైలెంట్ అయిపోయారు. చాలా గ్యాప్ తర్వాత ఇటీవలే దసరాకు గోపీచంద్‌తో కలిసి శ్రీను ‘విశ్వం’ చిత్రంతో ఆడియన్స్ ముందుకు వచ్చారు. ఈ సినిమాకు మిక్స్‌డ్ రివ్యూలు వచ్చాయి. సినిమా రోటీన్‌గా ఉన్నా, కామెడీ ట్రాక్ బాగుందంటూ ఆడియన్స్ రివ్యూలు ఇచ్చారు. కానీ బాక్సాఫీస్ దగ్గర నిలవడానికి మాత్రం ఇది సరిపోలేదు. తాజాగా ఈ సినిమా ఓటీటీలోకి వచ్చింది.

20 రోజుల్లోనే ఓటీటీకి

అక్టోబర్ 11న థియేటర్లలలో రిలీజైన ఈ సినిమా ఈరోజు (నవంబర్ 1)న ఓటీటీలో అడుగుపెట్టింది. అంటే థియేటర్లో రిలీజైన 20 రోజులకే విశ్వం ఓటీటీలో ఎంట్రీ ఇచ్చింది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతుంది. ఒక్క తెలుగులో మాత్రమే విశ్వం స్ట్రీమింగ్‌కి వచ్చింది. ఈ సినిమాలో కావ్య థాపర్ హీరోయిన్‌గా నటించింది అన్న విషయం తెలిసిందే. రూ.35 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా ఇప్పటివరకూ రూ.17 కోట్ల వరకే వసూలు చేసినట్లు టాక్ . ఈ సినిమాలో వీకే నరేష్, ప్రగతి, వీటీ గణేష్, శ్రీకాంత్ అయ్యంగార్, వెన్నెల కిషోర్, జిషు సేన్‌గుప్తా, సునీల్ వర్మ ముఖ్యమైన పాత్రల్లో నటించారు.

Advertisement

ఇక గోపీచంద్ విషయానికొస్తే చాలా నమ్మకంతో విశ్వం సినిమా చేశారు. కానీ శ్రీనువైట్ల కూడా గోపీచంద్‌కి హిట్టు ఇవ్వలేకపోయారు. వెంకీ సినిమాలోని ట్రైన్ సీక్వెన్స్ లాంటిదే విశ్వంలో కూడా ట్రై చేశారు శ్రీనువైట్ల. ఇది థియేటర్లో బాగానే నవ్వులు పూయించింది. కానీ లాంగ్ రన్‌లో సినిమాను మాత్రం నిలబెట్టలేకపోయింది. ఇక విశ్వం సినిమాకి ముందు భీమా, రామబాణం చిత్రాలు చేశారు గోపీచంద్. ఈ రెండు సినిమాల్లో రామబాణం డిజాస్టర్‌గా మారింది, భీమా మంచి టాక్‌ తెచ్చుకున్నా బాక్సాఫీస్‌ వద్ద ఫెయిల్‌ అయింది. ఇలా యాక్షన్‌, కామెడీ ఏదైనా ట్రై చేసినా గోపీచంద్‌కి హిట్ మాత్రం రావడం లేదు. మరోవైపు హీరోగా కాకుండా మళ్లీ విలన్‌గా గోపీచంద్‌ రీఎంట్రీ ఇవ్వాలని కొంతమంది ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఎందుకంటే వర్షం, నిజం, జయం లాంటి బ్లాక్‌బస్టర్ చిత్రాల్లో విలన్‌గా గోపీచంద్ ఎలా యాక్ట్ చేశారో అందరికీ తెలుసు. గోపీచంద్ కటౌట్‌కి భారీ యాక్షన్ సీక్వెన్స్‌లు బాగా సూట్ అవుతాయి. అందుకే విలన్‌గా మళ్లీ చేస్తే గోపీచంద్ కెరీర్‌కి మళ్లీ గాలి రావొచ్చని కొంతమంది ఆడియన్స్ అంటున్నారు.

Loading

Continue Reading
Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending