Connect with us

Telangana

వరంగల్ ప్రజల జీవితం మారినట్లే.. ఎప్పుడూ చూడనంతగా ప్రభుత్వం రూ.4962.47 కోట్లు మంజూరు చేసింది!

వరంగల్ ప్రజల జీవితం మారినట్లే.. ఎప్పుడూ చూడనంతగా ప్రభుత్వం రూ.4962.47 కోట్లు మంజూరు చేసింది!

తెలంగాణలో హైదరాబాద్ తర్వాత పెద్ద నగరమైన వరంగల్‌ను రాష్ట్ర రెండో రాజధానిగా అభివృద్ధి చేయడానికి రేవంత్ రెడ్డి సర్కార్ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా, వరంగల్-హన్మకొండ-కాజీపేట ట్రై సిటీస్ అభివృద్ధికి రూ.4962 కోట్లు కేటాయిస్తూ సర్కార్ పెద్ద నిర్ణయం తీసుకుంది. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో అనేక పనులకు నిధులు మంజూరు చేశారు. తెలంగాణ రెండో రాజధానిగా వరంగల్ పట్టణాన్ని అభివృద్ధి చేస్తామని రేవంత్ రెడ్డి సర్కార్ ఇప్పటికే ప్రకటించింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి చేసుకుంటున్న సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా విజయోత్సవాలు జరుపుతోంది. కేవలం సంబరాలు మాత్రమే కాకుండా, ప్రభుత్వం వరాల జల్లులు కూడా కురిపిస్తోంది. ఇందులో భాగంగా, హన్మకొండ, వరంగల్, కాజీపేట ట్రై సిటీల అభివృద్ధికి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంది. నవంబర్ 19న సీఎం రేవంత్ రెడ్డి వరంగల్ పర్యటనకు ముందు, ట్రై సిటీస్ ప్రజలకు శుభవార్త అందిస్తూ వరాలు ప్రకటించింది.

వరంగల్ కాకతీయుల కాలం నుంచి చారిత్రక ప్రాధాన్యం ఉన్న నగరమని, తెలంగాణలో హైదరాబాద్ తర్వాత రెండో పెద్ద నగరమని ప్రభుత్వం తెలిపింది. అయితే, ఇలాంటి చారిత్రక నగరంపై దశాబ్దాలుగా నిర్లక్ష్యం కొనసాగిందని పేర్కొంది. ఈ చారిత్రక నగరాన్ని అభివృద్ధి చేయడానికి ప్రజా ప్రభుత్వం కృషి చేస్తుందని స్పష్టంగా చెప్పింది. ఈ విషయాన్ని ఒక ప్రకటనలో ప్రకటించింది.

2041 మాస్టర్ ప్లాన్‌తో వరంగల్ నగరానికి సమగ్ర అభివృద్ధి కోసం ప్రణాళికలు రూపొందించినట్టు ప్రభుత్వం తెలిపింది. ప్రజా పాలన-ప్రజా విజయోత్సవాల సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి అభివృద్ధి పనులకు ప్రారంభం ఇవ్వనున్నారని పేర్కొంది. ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి పనులకు నిధులు కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వరంగల్ మహానగర అభివృద్ధికి రూ. 4962.47 కోట్లు కేటాయించగా, సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో ఈ నిధులను వివిధ పనులకు వినియోగించనున్నారు.

అభివృద్ధి పనులకు ఎన్నెన్ని నిధులు (కోట్లలో)..

వరంగల్ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ : రూ.4,170 కోట్లు

మామునూరు ఎయిర్ పోర్ట్ భూసేకరణ: రూ. 205 కోట్లు

Advertisement

కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్క్ : 160.92 కోట్లు

టెక్స్ టైల్ పార్కులో రోడ్లు, స్కూల్స్, సదుపాయాలు ..రూ.33.60 కోట్లు

టెక్స్ టైల్ పార్క్ కు భూములు ఇచ్చిన రైతులకు 863 ఇందిరమ్మ ఇండ్లు.. రూ. 43.15 కోట్లు

కాళోజీ కళాక్షేత్రం రూ.85 కోట్లు

పరకాల నుంచి ఎర్రగట్టు గుట్ట వరకు రోడ్డు విస్తరణ : రూ. 65 కోట్లు

Advertisement

నయీమ్ నగర్ బ్రిడ్జి నిర్మాణం: రూ.8.3 కోట్లు

వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ బిల్డింగ్ రూ. 32.50 కోట్లు

ఇన్నర్ రింగ్ రోడ్: రూ.80 కోట్లు

భద్రకాళి ఆలయం వద్ద పాలిటెక్నిక్ కాలేజీ న్యూ బిల్డింగ్ : రూ.28 కోట్లు

గ్రేటర్ వరంగల్ మున్సిపాలిటీ పరిధిలో రోడ్లు : రూ. 49.50

Advertisement

వరంగల్ ఉర్దూ భవన్, షాదీ ఖానా : 1.50 కోట్లు

Loading

Trending