Connect with us

Telangana

తెలంగాణలో కొత్త ఎయిర్‌పోర్టు. త్వరలోనే అందుబాటులోకి

రేవంత్ రెడ్డి సర్కార్ తెలంగాణ ప్రజలకు త్వరలోనే గుడ్ న్యూస్ వినిపించేందుకు సిద్ధమైంది. వరంగల్ జిల్లాలోని మమునూరు విమనాశ్రయాన్ని త్వరలోనే అందుబాటులోకి తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇస్తే.. వీలైనంత త్వరగా అందుబాటులోకి తీసుకొస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. వరంగల్‌ను రాష్ట్రానికి రెండో రాజధానిగా చేస్తామంటూ మంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రజలకు రేవంత్ రెడ్డి సర్కార్ మరో శుభవార్త అందించింది. తెలంగాణలో ఇప్పటికే హైదరాబాద్‌లో బేగంపేట విమానాశ్రయం, శంషాబాద్‌లో రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ఉన్నాయి.

ఇప్పటివరకు మరో ఎయిర్ పోర్టు అందుబాటులోకి రాలేదు. అయితే.. త్వరలోనే ఇంకో విమానాశ్రయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ సిద్ధమైంది. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. కేంద్రం అనుమతిస్తే మమునూరు విమానాశ్రయాన్ని త్వరలో అందుబాటులోకి తీసుకురాగలమని మంత్రి స్పష్టం చేశారు.
1980 నుంచి నిలిచిపోయిన మమునూరు విమానాశ్రయాన్ని త్వరలో తిరిగి ప్రారంభించి, ప్రాంతీయ విమాన సర్వీసులు ప్రారంబించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచిస్తున్నాయని సమాచారం. రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి సుమారు 170 కి.మీ దూరంలో ఉన్న మమునూరు.. ప్రాంతీయ కనెక్టివిటీ స్కీమ్ (RCS-ఉడాన్) కింద సేవలందించేందుకు తెలంగాణలోని ఆరు ప్రతిపాదిత విమానాశ్రయాలలో మొదటిది. ఇప్పటికే.. 700 ఎకరాలను ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) సిద్ధం చేసింది. 2024 చివరి నాటికి అందుబాటులోకి వస్తుందని అంతా ఆకాంక్షిస్తున్నారు. ఈ క్రమంలోనే.. మంత్రి పొంగులేటి చేసిన వ్యాఖ్యలు సర్వాత్రా ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.

వరంగల్‌లో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పర్యటించారు. ఆయన భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయానికి వచ్చిన మంత్రిని అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన మంత్రి.. అనంతర్ మీడియాతో మాట్లాడారు. భద్రకాళి అమ్మవారి ఆలయాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఆలయ మాడ వీధులను త్వరితగతిన పూర్తి చేస్తామని తెలిపారు. ఇక్కడి జలాశయాన్ని తాగునీటి జలాశయంగా మారుస్తామన్నారు. భద్రకాళి చెరువు కబ్జా చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సర్వే చేయించి నిర్మాణాలను తొలగిస్తామన్నారు. అయితే, జలాశయానికి సంబంధించిన వివరాలను అధికారులను అడగ్గా సరిగా స్పందించకపోవటంతో.. మంత్రి అసహనం వ్యక్తం చేశారు.

తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, వరంగల్‌ను రాష్ట్రానికి రెండో రాజధానిగా అభివృద్ధి చేస్తామని చెప్పారు. అలాగే, వరంగల్ నగరంలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులను ఆయన పరిశీలించారు. త్వరలోనే కాళోజీ కళా క్షేత్రం ప్రారంభం కానుంది. ఇంకా కొన్ని అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి వరంగల్ అభివృద్ధికి ప్రత్యేకంగా శ్రద్ధ చూపిస్తున్నారని మంత్రి తెలిపారు.

Loading

Advertisement

Trending