Connect with us

Telangana

తెలంగాణ టూరిజం శాఖ మంచి వార్త చెప్పింది. కొన్ని జలాశయాల్లో అడ్వెంచర్ వాటర్ స్పోర్ట్స్ ప్రారంభం కానున్నాయి.

తెలంగాణ టూరిజం శాఖ మంచి వార్త చెప్పింది. కొన్ని జలాశయాల్లో అడ్వెంచర్ వాటర్ స్పోర్ట్స్ ప్రారంభం కానున్నాయి.

అడ్వెంచర్ వాటర్ స్పోర్ట్స్ కోసం తెలంగాణ టూరిజం శాఖ మంచి వార్త తెలిపింది. త్వరలోనే రాష్ట్రంలోని కొన్ని జలాశయాల్లో ఈ క్రీడలు ప్రారంభమవుతాయని ప్రకటించింది. మొదటగా హైదరాబాద్ హుస్సేన్ సాగర్, సోమశిల జలాశయాల్లో వాటర్ స్పోర్ట్స్ అందుబాటులోకి వస్తాయని తెలిపారు.

తెలంగాణలో పర్యాటక అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోంది. లక్నవరం లేక్‌లో మూడో ఐలాండ్‌ను ప్రారంభించగా, సోమశిల-శ్రీశైలం లాంచీ ప్రయాణం కూడా అందుబాటులోకి తెచ్చింది. తాజాగా, టూరిజం శాఖ జలాశయాలు, నదుల బ్యాక్‌వాటర్‌లను సాహస జలక్రీడల కేంద్రాలుగా మార్చాలని ప్రణాళిక సిద్ధం చేసింది. మొదటగా 34 జలవనరుల్లో బోటు షికారును దశలవారీగా ప్రారంభించేందుకు యాక్షన్ ప్లాన్ రూపొందిస్తోంది.

తెలంగాణలో పర్యాటక అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోంది. లక్నవరం లేక్‌లో మూడో ఐలాండ్‌ను ప్రారంభించగా, సోమశిల-శ్రీశైలం లాంచీ ప్రయాణం కూడా అందుబాటులోకి తెచ్చింది. తాజాగా, టూరిజం శాఖ జలాశయాలు, నదుల బ్యాక్‌వాటర్‌లను సాహస జలక్రీడల కేంద్రాలుగా మార్చాలని ప్రణాళిక సిద్ధం చేసింది. మొదటగా 34 జలవనరుల్లో బోటు షికారును దశలవారీగా ప్రారంభించేందుకు యాక్షన్ ప్లాన్ రూపొందిస్తోంది.

తెలంగాణలో వాటర్ టూరిజాన్ని పెంచేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వాటర్ స్పోర్ట్స్‌ను ప్రారంభించేందుకు సిద్ధమైంది. హైదరాబాద్ హుస్సేన్‌సాగర్, సోమశిలతో పాటు నాగార్జునసాగర్, బుద్ధవనం వద్ద కృష్ణా నదిలో హౌస్‌బోట్లు, కరీంనగర్ లోయర్‌మానేరు డ్యామ్, రామప్ప చెరువు, లకారం, మధిర చెరువులు, గోదావరిఖని గోదావరి నదిలో, మహబూబ్‌నగర్, సిద్దిపేట కోమటి చెరువు, కోటిపల్లి రిజర్వాయర్, రంగనాయకసాగర్, భద్రకాళి చెరువు, కడెం రిజర్వాయర్, కొండ పోచమ్మ సాగర్ వంటి జలాశయాలను ఎంపిక చేశారు. వీటిలో స్పీడ్, డీలక్స్, హౌస్ బోట్లతో పాటు ఇతర సౌకర్యాలు కూడా అందించే ఉంటారు.

ఖమ్మం జిల్లా మధిరలో వాటర్ స్పోర్ట్స్, కాటేజీలు, రెస్టారెంట్, పిల్లలు ఆడుకునే పరికరాలు ఏర్పాటు చేయడానికి అధికారులు టెండర్లు పిలిచారు. సంగారెడ్డి జిల్లా సింగూరు రిజర్వాయర్‌లో 25-30 మంది టూరిస్టులు ప్రయాణించే డీలక్స్ బోట్లు, కాటేజీలు, ఓపెన్ జిమ్, కెఫెటీరియా వంటి సౌకర్యాలు ఏర్పాటు చేశారు. ఖమ్మం జిల్లా జమలాపురం చెరువు మరియు స్థానిక దేవస్థానం వద్ద కూడా టూరిస్టులకు సౌకర్యాలు కల్పించనున్నారు. టూరిజం డిపార్ట్‌మెంట్ 20, 40 సీట్లతో బోట్లు మరియు కాటేజీల నిర్మాణానికి టెండర్లు పిలిచింది.  ఇవి త్వరలో అందుబాటులోకి రానున్నాయి.

Advertisement

Loading

Trending