Telangana
సీఎం రేవంత్ రెడ్డి ర్యాంప్ వాక్.. చప్పట్లతో దద్దరిల్లిపోయిన స్టేడియం

గురువారం హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన చిల్డ్రన్స్డే వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. గత డిసెంబర్ 7న ఇదే బీ స్టేడియంలో ప్రజా ప్రభుత్వం ఏర్పడిందని ఆయన అన్నారు. ఈ ఏడాది ప్రభుత్వం హ్యాపీ చిల్డ్రన్స్ డే పేరుతో ఈ వేడుకలు భారీ ఎత్తున నిర్వహించడం విశేషం. అన్ని జిల్లాల నుంచి విద్యార్థులు పెద్ద సంఖ్యలో ఈ వేడుకల్లో పాల్గొన్నారు.
జాతీయ బాలల దినోత్సవ వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం ‘హ్యాపీ చిల్డ్రన్స్ డే’ పేరుతో హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ఘనంగా నిర్వహించింది.వివిధ జిల్లాల నుంచి వచ్చిన చిన్నారులు జాతీయ నాయకుల వేషధారణతో ఆకట్టుకున్నారు. జాతీయ సమైక్యతను చూపిస్తూ, వివిధ రాష్ట్రాల సంప్రదాయ నృత్యాలతో పిల్లలు ఉత్సాహంగా ప్రదర్శన ఇచ్చారు. బతుకమ్మలతో వచ్చి తెలంగాణ సంస్కృతిని అందంగా చూపించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి అనుముల రేవంత్రెడ్డి రాగానే, పిల్లలు కేరింతలు వేస్తూ, చప్పట్లు కొడుతూ అతనికి ఘన స్వాగతం చెప్పారు.
గురువారం సాయంత్రం 4.48 గంటలకు పిల్లల చప్పట్లు, కేరింతల మధ్య సీఎం సభావేదికకు చేరుకున్నారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ర్యాంప్పై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, దుద్దిళ్ల శ్రీధర్బాబుతో కలిసి వాక్ చేస్తూ, పిల్లలకు అభివాదం చేసి వారికి ఉత్సాహం కలిగించారు. ఈ సమయంలో విద్యార్థుల కేరింతలు, అరుపులతో ఎల్బీ స్టేడియం గడగడలాడింది. ఈ సందర్భంలో, అంగన్వాడి విద్యా వ్యవస్థపై రాసిన ‘ప్రియదర్శిని’ అనే పుస్తకాన్ని రేవంత్రెడ్డి ఆవిష్కరించి, పిల్లలకు అందజేశారు.
అనంతరం సీఎం మాట్లాడుతూ, గురుకుల్లో చదివే పిల్లలకు నాసిరకమైన భోజనం ఇచ్చితే జైలుకు పంపుతామని, దొడ్డు బియ్యం, కుళ్లిన కూరగాయలతో భోజనం ఇస్తే అనుమతించేది లేదని హెచ్చరించారు. ‘రాష్ట్రంలోని పాఠశాలలు, గురుకులాల్లో పిల్లలకు ఇచ్చే అన్నం, కూరలు నాసిరకంగా ఉన్నాయి’ అని ఆయన చెప్పారు. ఈ కారణంగా పిల్లల ఆరోగ్యం దెబ్బతినిపోతుంది. కలుషిత ఆహారం తింటూ హాస్పిటల్స్ వెళ్లిపోతున్నారు. అధికారులకు ఆదేశాలు ఇవ్వడమైనప్పటికీ, నాసిరకమైన భోజనాలు అందిస్తే, సరుకులు సరఫరా చేసినా, దాన్ని గమనించి చర్య తీసుకోవాల్సిందే అని సీఎం వార్నింగ్ ఇచ్చారు.
గత ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో వేలాది పాఠశాలలు మూతపడ్డాయని సీఎం అన్నారు. అందుకే విద్యాశాఖను తన దగ్గర ఉంచుకున్నానని, ఈ సారి బడ్జెట్లో రూ. 21 వేల కోట్ల నిధులు కేటాయించామని చెప్పారు. బడ్జెట్లో 7 శాతానికి పైగా నిధులు విద్యాశాఖకు కేటాయించామని రేవంత్ రెడ్డి చెప్పారు. మరోవైపు, అండర్-18 వరల్డ్ సంస్థ ఆధ్వర్యంలో స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రిసెర్చ్ అండ్ ట్రెయిన్ (ఎస్సీఈఆర్టీ) గురువారం మాక్ అసెంబ్లీ నిర్వహించింది. శాసనసభలో తీర్మానాలు, ప్రశ్నోత్తరాలు, ఓపెన్ హౌస్లో లాగా చర్చలు జరిగినప్పటికి కార్యక్రమం ఆసక్తిగా సాగింది. సీఎంగా సాయివర్ధన్ అనే విద్యార్ధితో పాటు ఎమ్మెల్యేలు, స్పీకర్, డిప్యూటీ స్పీకర్ పాత్రలను పోషించిన విద్యార్థులు మాటలతో ఆకట్టుకున్నారు. ఈ మాక్ అసెంబ్లీకి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం హాజరై ఆద్యంతం ఆసక్తిగా తిలకించారు
-
Devotional8 months ago
ఖైరతాబాద్ మహా గణపతి: 70 ఏళ్లు.. 70 అడుగులు
-
Entertainment8 months ago
శేఖర్ బాష మరియు మణికంట మధ్యలో మాటల యుద్ధం | Bigboss |Telugu Biggboss Season8 | Day 4 | Nagarjuna
-
Devotional8 months ago
Lalbaugcha Raja: 10 రోజుల్లోనే గణేషుడికి కోట్ల సంపద..
-
Politics7 months ago
విజయ్పై డీఎంకే, అన్నాడీఎంకే సంచలన వ్యాఖ్యలు ఆయన కాపీరాయుడు