Connect with us

Telangana

గృహజ్యోతి పథకం కింద జీరో కరెంట్ బిల్లులు రాని వారికి విద్యుత్ పంపిణీ సంస్థలు శుభవార్త చెప్పాయి

గృహజ్యోతి పథకం కింద జీరో కరెంట్ బిల్లులు రాని వారికి విద్యుత్ పంపిణీ సంస్థలు శుభవార్త చెప్పాయి. వినియోగదారుల దగ్గర లోని  విద్యుత్ సరఫరా  కేంద్రాలకు వెళ్లి అప్లయ్ చేసుకోవాలని సూచించాయి. జీహెచ్‌ఎంసీ సరిల్‌ కార్యాలయాల్లో, మున్సిపల్‌,మండల పరిషత్తు, జీహెచ్‌ఎంసీ సరిల్‌ కార్యాలయాల్లోనూ ప్రత్యేక కౌంటర్లు ఉన్నాయని అక్కడ కూడా చేసుకోవచ్చునని చెప్పాయి.

కాంగ్రెస్ ప్రభుత్వం  తెలంగాణ లో ఆరు గ్యారంటీల అమల్లో భాగంగా గృహజ్యోతి పథకం ప్రవేశపెట్టారు ఈ పథకం కింద 200 యూనిట్లలోపు కరెంట్ వాడే  వారికి ఉచిత కరెంట్ ఇస్తున్నారు. అంటే 200 యూనిట్లలోపు కరెంట్ వాడే వారు బిల్లులు చెల్లించాల్సిన అవసరం లేదు . ఈ పథకం అమల్లోకి వచ్చి 6 నెలలు అయింది.

ప్రతి నెలా వినియోగదారులు 200 యూనిట్లలోపు కరెంటు వాడుతున్నా.. ఇవన్నీ పూర్తిగా గృహజ్యోతి ఉచిత కరెంట్ పథకం పరిధిలోకి రాలేదు. ఇప్పటివరకూ రెండు విడుతాలు గా అఫ్లికేషన్లు ఇచ్చిన దాదాపు 50 లక్షల కుటుంబాలను గుర్తించి గృహజ్యోతి పథకం కింద నెలనెలా ఆయా వినియోగదారులకు జీరో కరెంటు బిల్లులను డిస్కంలు జారీచేస్తున్నాయి. సౌత్ డిస్కం పరిధిని చూసుకుంటే.. 39.15 లక్షల వినియోగదారులు 200 యూనిట్లలోపే విద్యుత్ వాడుతున్నారు. కానీ ఇప్పటి వరకూ 23 లక్షల ఇళ్లకు మాత్రమే గృహజ్యోతి పథకం కింద జీరో కరెంట్ బిల్లులు జారీ చేస్తున్నారు.

మిగిలిన ఇళ్లలో కొందరికి రేషన్‌కార్డులు లేవు. కొన్ని కుటుంబాలకు రెండు లేదా అంతకుమించి ఇళ్లలో ఒకే పేరుతో విద్యుత్ మీటర్ కనెక్షన్లు ఉన్నట్లు గుర్తించారు. ఆయా కారణాలతో వారికి గృహజ్యోతి పథకం వర్తించటం లేదు. ఈ నేపథ్యంలో రేషన్‌కార్డు ఉన్న కుటుంబ ఓనర్ పేరుతో ఒకటికి మించిన ఇండ్లకు కరెంటు కనెక్షన్లు ఉంటే వాటిలో ఒక ఇంటికి గృహజ్యోతి పథకం కింద జీరో బిల్లు ఇవ్వనున్నట్లు అధికారులు వెల్లడించారు. అన్ని అర్హతలు ఉన్నా.. ఇప్పటికీ ఈ పథకం వర్తించని వారు.. సమీపంలోని విద్యుత్‌ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని చెబుతున్నారు. అధికారులు పరిశీలన చేసి గృహజ్యోతి పథకాన్ని అమలు చేస్తాయని డిస్కంల వర్గాలు వెల్లడించాయి. ఆందోళన చెందకుండా ఆయా వినియోగదారులు విద్యుత్ శాఖ అధికారులను సంప్రదించాలన్నారు.

గృహజ్యోతి బిల్లు రూ.3,914 కోట్లుఇక తెలంగాణలో 200 యూనిట్ల లోపు కరెంటు వాడే ఇళ్ల కనెక్షన్లు 1,08,86,519 ఉన్నాయని డిస్కంలు స్పష్టం చేశాయి. ఈ ఇండ్ల నుంచి 2024-25 ఆర్థిక సంవత్సరంలో కరెంటు బిల్లుల రూపంలో రూ.3,914.36 కోట్ల ఆదాయం వస్తుందని అధికారులు వెల్లడించారు. రాష్ట్ర విద్యుత్‌ నియంత్రణ మండలికి విడుతాలు గా నివేదిక అందించాయి. నెలకు 201కి పైగా యూనిట్ల కరెంటు వాడే ఇళ్ల నుంచి రూ.4,374 కోట్ల ఆదాయం వస్తుందని నివేదికలో పేర్కొన్నాయి.

Advertisement

Loading

Trending