Connect with us

Telangana

బ్యాంక్ అకౌంట్ వివరాలు ఎవరికైనా ఇస్తున్నారా? అయితే జాగ్రత్త! ఇచ్చేస్తే బుక్కైనట్టే! 

 బ్యాంక్ అకౌంట్ వివరాలు ఎవరికైనా ఇస్తున్నారా? అయితే జాగ్రత్త! ఇచ్చేస్తే బుక్కైనట్టే! 

 తెలిసిన బంధువులు, స్నేహితులు అడిగారాని బ్యాంకు ఖాతా వివరాలు ఇస్తున్నారా..? అయితే మీరు చిక్కుల్లో పడ్డట్లే. పోలీసు కేసులు, అవసరమైతే జైలుకు వెళ్లటం ఖాయం. ఎందుకంటే కొందరు సైబర్ నేరగాళ్లు బాధితులను బెదిరించగా వచ్చే డబ్బులను ఇటువంటి ఖాతాల్లోకి మళ్లిస్తున్నారు. ఏజెంట్లను నియమించుకొని డబ్బులు వివిధ ఖాతాల్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. 

 ఇటీవల కాలంలో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. రకరకాల పద్ధతుల్లో మోసాలకు పాల్పడుతున్నారు. రోజుకో తరహా కొత్త మార్గంలో అమాయకులను బురిడీ కొట్టిస్తున్నారు. కొందర్ని డ్రగ్స్ పార్శిల్స్ పేరిట బెదిరించి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు. తాము చెప్పిన అకౌంట్లలో డబ్బులు వేయాలంటూ బెదిరిస్తున్నారు. అక్రమంగా వచ్చే డబ్బులు జమ చేయడానికి కేటుగాళ్లు కమీషన్లు ఇస్తూ బ్యాంక్ ఖాతాలు సెట్ చేసుకుంటున్నారు. కొంతమంది వద్ద నుంచి బ్యాంక్ అకౌంట్లు తీసుకుని నెలకు కమీషన్ ఇస్తున్నారు. 

 ఇలా సైబర్ కేటుగాళ్ల మాటలు నమ్మి బ్యాంకు అకౌంట్ల ఇస్తే జైలుకు వెళ్లటం ఖాయం. తాజాగా హైదరాబాద్ ముషీరాబాద్కు చెందిన అలీబేగ్అనే వ్యక్తి తన బావ అస్లాం సూచనతో బ్యాంకు అకౌంట్ లావాదేవీలను వ్యక్తికి అప్పగించాడు. సైబర్నేరాలు చేసే వ్యక్తి అలీబేగ్ ఖాతా ద్వారా లక్షల్లో లావాదేవీలు జరిపాడు. సైబర్మోసాల్లో బాధితులు చెల్లించిన డబ్బు అలీబేగ్ ఖాతాలోకి వెళ్తుందని పోలీసులు గుర్తించారు. సైబర్క్రైమ్పోలీసులు అలీబేగ్ను అరెస్ట్చేశారు. తనకు ఏమీ తెలియదని, తన బావ అస్లాం చెప్పి అకౌంట్ ఇచ్చానని అలీ చెప్పాడు. అలానే అస్లాం మరికొందరి నుంచి కూడా బ్యాంక్ఖాతాలు తీసుకుని విదేశాలకు పంపినట్లు విచారణలో తెలిసింది. 

 హైదరాబాద్ నగరంలో చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేవారు నిరుద్యోగులు, పాతనేరస్థులను టార్గెట్గా చేసుకొని బ్యాంకు అకౌంట్లు తీసుకుంటున్నారు.వారి పేర్లతో నకిలీ సంస్థలు సృష్టించి కరెంట్ అకౌంట్లు తెరవిస్తున్నారు. బ్యాంకు అకౌంట్లు ఇచ్చిన వారికి నెలకు రూ.5-10 వేలు, కొందరికి బ్యాంకు ట్రాన్సాక్షన్లపై 10 శాతం కమీషన్ ఇస్తున్నారు. బాధితుల నుంచి వచ్చే డబ్బును యూపీఐ ద్వారా మళ్లీ వేర్వేరు ఖాతాల్లోకి బదిలీ చేస్తున్నారు. నగదును మనీట్రాన్స్ఫర్ఏజెన్సీల ద్వారా విదేశాలకు పంపుతున్నారు. అక్కడ నగదు క్రిప్టోగా మారి చైనాకు చేరుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఎవరికి బ్యాంకు అకౌంట్లు ఇవ్వవద్దని.. అలా అకౌంట్లు ఇచ్చి సైబర్ నేరాల కేసుల్లో చిక్కుకోవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. 

Advertisement

Loading

Trending