Telangana
సైబర్ నేరా గురించి కీలక వివరాలు చెప్పిన సీపీ సీవీ ఆనంద్.. 36 రకాల సైబర్ నేరాలే ఎక్కువగా జరుగుతున్నాయి..

సైబర్ నేరా గురించి కీలక వివరాలు చెప్పిన సీపీ సీవీ ఆనంద్.. 36 రకాల సైబర్ నేరాలే ఎక్కువగా జరుగుతున్నాయి..
సైబర్ నేరాల గురించి హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ ముఖ్యమైన వివరాలు తెలిపారు. ఈ ఏడాది 24 శాతం అధికంగా సైబర్ నేరాలు జరిగాయని ఆయన తెలిపారు. మొత్తం 36 రకాల సైబర్ నేరాలు జరుగుతున్నాయని ఆయన తెలిపారు. ఎక్కువగా ఉన్నత విద్య చదివినవారే మోసపోతున్నారని సీపీ చెప్పారు. సైబర్ నేరగాళ్ల నుంచి ఈ ఏడాది ఇప్పటివరకు రూ. 35.5 కోట్లను బాధితులకు తిరిగి ఇప్పించామని ఆయన చెప్పారు. సైబర్ సెక్యూరిటీ సమ్మిట్ ‘హాక్ 2.0’లో ఆయన మాట్లాడారు. సైబర్ నేరాలు రోజురోజుకు పెరుగుతున్నాయని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ చెప్పారు. ఈ ఏడాది సైబర్ నేరాలు 24% పెరిగాయన్నారు. రాష్ట్రంలో ఎక్కువగా 36 రకాల సైబర్ నేరాలు జరుగుతున్నారని ఆయన చెప్పారు.
‘డిజిటల్ అరెస్టులు’ ఇటీవల తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని సీవీ ఆనంద్ అన్నారు. అంతేకాకుండా, బాగా చదువుకున్నవారే సైబర్ నేరస్థుల ఉచ్చులో చిక్కుకుని మోసపోతున్నారని సీపీ చెప్పారు. ఈ ఏడాది ఇప్పటివరకు రూ.35.8 కోట్లను బాధితులకు తిరిగి ఇచ్చామని ఆయన చెప్పారు. సైబర్ నేరాలను అరికట్టడం కేవలం పోలీసుల పని మాత్రమే కాదని, అందరితో కలిసి పనిచేస్తేనే సైబర్ నేరగాళ్లను ఎదుర్కొనవచ్చని ఆయన చెప్పారు. సైబర్ కేసుల్లో నిందితులను అరెస్టు చేయడం కష్టంగా మారిందని సీపీ సీవీ ఆనంద్ చెప్పారు. వారు ఎక్కడో ఉండి మోసం చేస్తారని, చిరునామాలను కనుగొని తెలంగాణ పోలీసులు వారిని అరెస్టు చేసేందుకు వెళ్తే కొన్నిసార్లు అక్కడి స్థానికులు దాడి చేస్తున్నారని సీపీ తెలిపారు. ఇటీవల రాజస్థాన్లో 28 మంది సైబర్ నేరగాళ్లను అరెస్టు చేశారని ఆయన చెప్పారు. వారంతా దేశమంతా 243 కేసుల్లో నిందితులుగా ఉన్నారు, అందులో 28 కేసులు తెలంగాణలోనే ఉన్నాయని సీవీ ఆనంద్ వివరించారు.
హైదరాబాద్లో హాక్ 2.0 పేరుతో నిర్వహిస్తున్న సైబర్ సెక్యూరిటీ సమ్మిట్ను మంత్రి శ్రీధర్బాబు.. బుధవారం (నవంబర్ 6) ప్రారంభించారు. ఈ సందర్భంలో నిర్వహించిన కార్యక్రమంలో సీపీ సీవీ ఆనంద్ మాట్లాడారు. “సైబర్ నేరస్థులు దూర ప్రాంతాలలో కూర్చొని నేరాలకు పాల్పడుతున్నారు” అని చెప్పారు .ఇతర రాష్ట్రాలకు వెళ్లి వారిని అరెస్టు చేయడం సవాళ్లతో కూడుకున్న పని. చాలా సవాళ్ల మధ్య సైబర్ నేరగాళ్లను తెలంగాణ పోలీసులు పట్టుకువస్తున్నారు’ అని సీవీ ఆనంద్ తెలిపారు.
సైబర్ నేరాలను అరికట్టడానికి తెలంగాణ ప్రభుత్వం మంచి ప్రయత్నాలు చేస్తోందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. రాష్ట్రంలో ఏర్పడిన సైబర్ సెక్యూరిటీ బ్యూరో ద్వారా మంచి ఫలితాలు వస్తున్నాయని ఆయన చెప్పారు. హాక్ సమ్మిట్లో నిపుణులు ఇచ్చే సూచనలు సైబర్ సెక్యూరిటీలో ముఖ్యమైనవిగా మారుతాయని ఆయన ఆశించారు. “రియల్ గ్లోబల్ సైబర్ సిటీ”గా హైదరాబాద్ తయారవుతున్నట్లు ఆయన చెప్పారు. సైబర్ నేరాలపై అవగాహన పెంచేందుకు రూపొందించిన వీడియోలను ఈ సందర్భంలో మంత్రి శ్రీధర్ బాబు విడుదల చేశారు. ఈ కార్యక్రమం నిర్వహించిన నిర్వాహకులకు ఆయన అభినందనలు తెలిపారు. ఈ సమ్మిట్లో సీపీ సీవీ ఆనంద్తో పాటు సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖా గోయల్ కూడా పాల్గొన్నారు.
-
Devotional8 months ago
ఖైరతాబాద్ మహా గణపతి: 70 ఏళ్లు.. 70 అడుగులు
-
Entertainment8 months ago
శేఖర్ బాష మరియు మణికంట మధ్యలో మాటల యుద్ధం | Bigboss |Telugu Biggboss Season8 | Day 4 | Nagarjuna
-
Devotional8 months ago
Lalbaugcha Raja: 10 రోజుల్లోనే గణేషుడికి కోట్ల సంపద..
-
Politics7 months ago
విజయ్పై డీఎంకే, అన్నాడీఎంకే సంచలన వ్యాఖ్యలు ఆయన కాపీరాయుడు