Telangana
కొండా సురేఖ కి పరువు నష్ట౦ దావా వేస్తూ నోటీసులు పంపిన : KTR

కొండా సురేఖ కి పరువు నష్ట౦ దావా వేస్తూ నోటీసులు పంపిన : KTR
తనపై చేసిన ఆరోపణలు అన్నీ అసత్యమని మంత్రి కొండా సురేఖకు మాజీ మంత్రి కేటీఆర్ లీగల్ నోటీసులు పంపించారు. 24 గంటల్లో ఆమె క్షమాపణలు చెప్పకపోతే చట్ట ప్రకారం పరువు నష్టం దావా వేయడంతోపాటు క్రిమినల్ కేసులు కూడా నమోదు చేస్తానని కేటీఆర్ హెచ్చరికలు జారీ చేశారుకొండా సురేఖ బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. . మరోవైపు.. కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ మంత్రి కొండా సురేఖకు లీగల్ నోటీసులు పంపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో టాలీవుడ్ కపుల్స్ నాగచైతన్య, సమంత విడిపోవడానికి సైతం కారణం కేటీఆర్ అని వ్యాఖ్యలు చేశారని, ఫోన్ టాపింగ్ చేశారంటూ కొండా సురేఖ ఆరోపించారు , తన గౌరవానికి భంగం కలిగించాలన్న లక్ష్యంగానే కొండా సురేఖ తనపై ఆరోపణలు చేశారని కేటీర్ మంత్రికి పంపి౦చిన లీగల్ నోటీసులో ఉన్నాయి . కొండా సురేఖ క్షమాపణ చెప్పకపోతే క్రిమినల్ కేసులు వేస్తానని.. చట్ట ప్రకారం పరువు నష్టం దావాను వేస్తాం అని మహిళా మంత్రిని కేటీఆర్ హెచ్చరించారు
Actor సమంత, నాగ చైతన్య విడాకులకు కారణం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ అంటూ మంత్రి కొండా సురేఖ ఆరోపించారు అవి తీవ్ర విమర్శలకు దారి తీస్తున్నాయి. దీనిపై సినీ వర్గాల నుంచి రాజకీయ నాయకుల నుండి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. అక్కినేని నాగార్జున, నాగ చైతన్య, సమంత సహా సినిమా వర్గాలు వరుసగా స్పందిస్తున్నారు. ఒక మహిళ గౌరవనీయ మంత్రి పదవిలో ఉండి.. ఒక మహిళపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఈ ఆరోపణల పై కొండా సురేఖ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తుండగా.. కాంగ్రెస్ నేతలు మాత్రం కొండా సురేఖకు మద్దతుగా కేటీఆర్పై విమర్శలు చేస్తునే ఉన్నారు. అందువలనే కేటీఆర్ కొండా సురేఖకు లీగల్ నోటీసులు పంపించారు.
కొండా సురేఖ చేసిన ఆరోపణలు తప్పని.. రాజకీయ కక్షతోనే ఈ వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు. ఒక సాటి మహిళ అయి ఉండి ఇంకో మహిళ పేరును వాడుకొని వ్యక్తిత్వ విషయాలో కల్పించుకోవడం సరైనది కాదు అన్నారు . ఫోన్ ట్యాపింగ్తో తనకు సంబంధం లేదని.. కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు పూర్తిగా అవాస్తవాలని వెల్లడించారు. మంత్రి పదవిని ఆమె దుర్వినియోగం చేశారని.. మనసులో దురుద్దేశంతో కొండా సురేఖ చేసిన ఆరోపణలు సోషల్ మీడియాలో, మీడియాతో పాటు వైరల్ అయ్యాయని తెలిపారు. గతంలో కూడా కొండా సురేఖ ఇలాంటి తప్పుడు వ్యాకలు చేసినందున భారత ఎన్నికల సంఘం ఆమె ను హెచ్చరి౦చింది. చేసిందని గుర్తు చేశారు. ఇక 24 గంటల్లో క్షమాపణ చెప్పకపోతే చట్టప్రకారం పరువు నష్టం దావా వేయడంతో పాటు క్రిమినల్ కేసులు కూడా వేస్తానని కేటీఆర్ హెచ్చరించారు
-
Devotional9 months ago
ఖైరతాబాద్ మహా గణపతి: 70 ఏళ్లు.. 70 అడుగులు
-
Entertainment8 months ago
శేఖర్ బాష మరియు మణికంట మధ్యలో మాటల యుద్ధం | Bigboss |Telugu Biggboss Season8 | Day 4 | Nagarjuna
-
Devotional8 months ago
Lalbaugcha Raja: 10 రోజుల్లోనే గణేషుడికి కోట్ల సంపద..
-
Politics7 months ago
విజయ్పై డీఎంకే, అన్నాడీఎంకే సంచలన వ్యాఖ్యలు ఆయన కాపీరాయుడు