Connect with us

Telangana

భద్రాచలం రామయ్య భక్తులకు మంచి వార్త. ఇక నుంచి ఆన్‌లైన్‌లో పూజలు చేసే అవకాశం ఉంటుంది,

భద్రాచలం రామయ్య భక్తులకు మంచి వార్త. ఇక నుంచి ఆన్లైన్లో పూజలు చేసే అవకాశం ఉంటుంది, ఆలయ ఈవో ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నారు. 

భద్రాచలం రామయ్య భక్తులకు మంచి వార్త. ఇక నుంచి ఆన్లైన్లో అన్న ప్రసాదం టికెట్లు అందుబాటులో ఉంటాయి. ప్రస్తుతం మాన్యువల్గా గంటలో ఒకసారి మాత్రమే టికెట్లు ఇవ్వబడతాయి, అందులో కొందరికి మాత్రమే అన్న ప్రసాదం దొరుకుతుంది. అయితే, ఆన్లైన్ టికెటింగ్ ద్వారా అన్న ప్రసాదం అందుకోవడానికి అందరికీ అవకాశం కల్పించేందుకు ఆలయ ఈవో చర్యలు తీసుకున్నారు.  భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి భక్తులకు తీపి కబురు. రామయ్య భక్తులు పవిత్రంగా స్వీకరించే అన్న ప్రసాదం పై ఆలయ ఈవో ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నారు. అన్నదాన సత్రంలో ఆన్లైన్ సేవలను అమలు చేయడానికి ప్రణాళిక సిద్ధం చేశారు. ఇందుకు సంబంధించిన ప్రక్రియను ఇప్పటికే పూర్తి చేశారు. చాలా కాలంగా ఆలయం వద్ద సంబంధిత అన్నసత్రం ఉద్యోగి భక్తులకు అన్నప్రసాదం టికెట్లు ఇస్తున్నారు. టికెట్లను తీసుకెళ్లి అన్నదాన సత్రంలో అందిస్తే.. అక్కడి సిబ్బంది భక్తులకు అన్న ప్రసాదం వడ్డించేవారు. ప్రతి రోజూ దాదాపు 1000 మందికి పైగా భక్తులు అన్న ప్రసాదం అవకాశాన్ని ఉపయోగించుకుంటున్నారు. 

ఇక వీకెండ్ డేస్ అయిన శని, ఆదివారాలతోపాటు ముఖ్యమైన పండగలు, ఉత్సవాల సమయాల్లో అన్నప్రసాదం అందుకుంటున్న భక్తుల సంఖ్య ఎక్కవగా ఉంటోంది. అయితే, అన్న ప్రసాదం టికెట్లను గంటసేపు మాత్రమే ఇస్తున్నారు. కారణంగా, రద్దీగా ఉన్న సమయాల్లో అన్న ప్రసాదం అందని పరిస్థితి ఏర్పడుతుంది. ఇక నుంచి సమస్య తలెత్తకుండా అన్నదానం తీసుకోవాలనుకునే ప్రతి ఒక్క భక్తుడికి భోజనం వడ్డించేందుకు ఆలయ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఆన్లైన్ రశీదుల ద్వారా భక్తులందరికీ అన్న ప్రసాదం అందించేందుకు సిద్ధమయ్యారు. 

 ఆలయం పడమర మెట్ల సమీపంలో ఉన్న అన్నదాన సత్రంలోనే, భక్తుల కోసం ఆన్లైన్టికెటింగ్ వ్యవస్థను అందుబాటులోకి తీసుకురావడం మంచిది. ఇది భక్తులకు సౌకర్యాన్ని కలిగించేందుకు, రద్దీని తగ్గించడానికి మరియు అన్న ప్రసాదం అందరికీ చేరుకోవడానికి అనువైన నిర్ణయం. అన్నప్రసాదం స్వీకరంచాలనుకునే భక్తులు అక్కడ ఏర్పాటు చేసే కంప్యూటర్కెమెరా ముందు నిలబడితే అది ఫొటో తీస్తుంది. అలా ఫొటో దిగినవారికి ప్రత్యేకంగా నంబర్తో అన్నప్రసాదం రసీదు వస్తుంది. దీన్ని తీసుకుని సత్రానికి వెళ్తే అక్కడి సిబ్బంది భోజనం వడ్డిస్తారు. స్వామివారి అన్న ప్రసాదం వితరణలో పారదర్శకతకు ప్రాధాన్యం ఇవ్వటంతో పాటుగా రద్దీకి అనుగుణంగా వంటలు చేసి భక్తులకు వడ్డించాలని ఆలయ అధికారులు నిర్ణయించారు. 

 ప్రస్తుతం అన్నప్రసాదంలో అన్నం, ఒక కూర, పప్పు, సాంబారు, పచ్చడి, మజ్జిగ, మిఠాయితో భక్తులకు భోజనం అందిస్తున్నారు. అన్నదానానికి కొందరు భక్తులు విశేషంగా విరాళాలు ఇస్తున్నారు. విరాళాలతో రామయ్య ఖాతాలో సుమారు రూ.40 కోట్లు ఉన్నాయ్. డబ్బుతో ప్రతిరోజు 2 వేల మందికి అన్నదానం చేయవచ్చు. కానీ అందుకోసం సత్రం నిర్మించాలి. త్వరలో సత్రాన్ని విస్తరించి మరింత మంది భక్తులకు అన్న ప్రసాదం అందించనున్నట్టు ఆలయ అధికారులు చెప్తున్నారు. 

Advertisement

 

Loading

Trending