Connect with us

Telangana

హైదరాబాద్ మెట్రో సెకండ్ ఫేజ్.. ట్రైన్లు అప్పటికి అందుబాటులోకి రానున్నాయి..! 

హైదరాబాద్ మెట్రో సెకండ్ ఫేజ్.. ట్రైన్లు అప్పటికి అందుబాటులోకి రానున్నాయి..! 

Hyderabad Metro Second Phase: హైదరాబాద్ మెట్రో సెకండ్ ఫేజ్ నిర్మాణం ఎప్పుడెప్పుడా అని నగరవాసులు ఆశగా ఎదురు చూస్తున్నారు. కొత్త ట్రైన్ కారిడార్లతో నగరం నలుమూలలకు మెట్రో సేవలు అందనున్నాయి. ప్రాజెక్టు డీపీఆర్కు రెండు రోజుల క్రితం కేబినెట్ సమావేశంలో ఆమోదం లభించింది. డీపీఆర్ మరియు ఇతర పత్రాలను కేంద్ర ప్రభుత్వ అనుమతికి కూడా పంపించారు. అయితే కేంద్రం ఆమోదం తర్వాత మెట్రో ప్రాజెక్ట్ను పట్టాలెక్కించనున్నట్లు అధికార వర్గాలు వెల్లడిస్తున్నాయి. 

 హైదరాబాద్ నగరంలో మెట్రోకు ఉన్న ఆదరణను దృష్టిలో ఉంచుకొని సెకండ్ ఫేజ్ నిర్మాణానికి కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఎల్బీనగర్మియాపూర్, నాగోల్రాయదుర్గం, జేబీఎస్ఎంజీబీఎస్ మధ్య మెట్రో ట్రైన్లు నడుస్తున్నాయి. రోజుకు సగటున 5 లక్షల మంది ప్రయాణికులు మెట్రోలో ప్రయాణిస్తున్నారు. మెట్రోకు మంచి ఆదరణ ఉండటంతో, నాగోల్శంషాబాద్, రాయదుర్గంకోకాపేట్, మియాపూర్పటాన్చెరు, ఎల్బీనగర్హయత్ నగర్, ఎంజీబీఎస్చాంద్రాయణగుట్ట మార్గాల్లో మొత్తం 76.4 కిలోమీటర్లు విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 

 శనివారం (అక్టోబర్ 26) సాయంత్రం జరిగిన కేబినెట్ సమావేశంలో డీపీఆర్కు ఆమోదం లభించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో మెట్రో రెండో దశ ప్రాజెక్టు కోసం రూ. 24,269 కోట్లతో ప్రణాళికలు రూపొందించారు. ప్రాజెక్టును పీపీపీ విధానంలో చేయనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. డీపీఆర్కు కేంద్రం ఆమోదం రాగానే పనులు ప్రారంభించాలని సర్కార్ యోచిస్తోంది.పనులు మెుదలైన 4 సంవత్సరాల్లోనే పూర్తి చేయాలని టార్గెట్గా పెట్టుకున్నారు. రెండో దశ మెట్రో ప్రాజెక్టుతో 8 లక్షల మందికి ప్రయాణ సౌలభ్యం కలగనున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. 

 మెట్రో సెకండ్ ఫేజ్లో మెుత్తం 116.4 కి.మీ. మేర ఆరు కారిడార్లను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. 76.4 కి.మీ. మేర 5 కారిడార్లకు ప్రస్తుతం డీపీఆర్ సిద్ధం చేశారు. శంషాబాద్ఎయిర్పోర్టు నుంచి ఫోర్త్సిటీ వరకు 40 కి.మీ. మాత్రం డీపీఆర్ సిద్ధం చేయలేదు. ప్రస్తుతం మార్గానికి క్షేత్రస్థాయి అధ్యయనాలు కొనసాగుతున్నట్లు అధికార వర్గాలు వెల్లడిస్తున్నాయి. సెకండ్ ఫేజ్ ప్రాజెక్ట్ ఖర్చులో 30 శాతం రాష్ట్ర ప్రభుత్వం, 18 శాతం కేంద్ర ప్రభుత్వం భరిస్తాయి. 48 శాతం సావరిన్గ్యారంటీతో జైకా, ఏడీబీ, ఎన్డీపీ వంటి సంస్థల నుంచి నిధులు సేకరించినున్నారు. మిగిలిన 4 శాతం ఖర్చును పీపీపీ విధానంలో సమకూర్చుకుంటామని ప్రభుత్వం స్పష్టం చేసింది. 

Advertisement

Loading

Trending