Connect with us

Telangana

నెలకు లక్షల్లో ఆదాయం.. గాడిద పాల వ్యాపారం..

నెలకు లక్షల్లో ఆదాయం.. గాడిద పాల వ్యాపారం..  ఐదుగురు కలిసి ఏకంగా రూ.100 కోట్లు నొక్కేశారు

గాడిద పాలు లీటర్‌కు రూ.1600. గాడిద పాల వ్యాపారు చేస్తే లక్షల్లోనే ఆదాయం వస్తుంది. ఏమాత్రం ఆలోచించకుండా ఈ వ్యాపారాన్ని మొదలు పెట్టేసేయండి అంటూ సోషల్ మీడియాలో వచ్చిన ప్రచారాన్ని నమ్మి.. రెండు తెలుగు రాష్ట్రాల్లోని రైతులే కాదు.. మిగతా రాష్ట్రాల్లోని రైతులు కూడా ఈ పాలసీలో చేశారు. ఒక్కొక్కరు 30 నుంచి 50 లక్షలు దొంగిలించి, మొత్తంగా వంద కోట్లు దోచి పారిపోయారు. ఈ పెద్ద కుంభకోణం తాజాగా బయటపడింది.  ఇటీవల, సోషల్ మీడియాలో మరియు మార్కెట్‌లో గాడిద పాల గురించి చాలా చర్చ జరుగుతోంది. గాడిద పాలం ఆరోగ్యానికి మంచిది, పోషక విలువలు ఎక్కువగా ఉంటాయంటూ ప్రచారం జరుగుతోంది.

గాడిద పాటు లీటర్‌కు రూ.1600 అంటా. ఇంత ఖరీదు ఉన్నాయంటే  పోషకాలు దండిగా ఉంటాయి కావొచ్చు. పోషకాలు పక్కన పెడితే.. కాసులు గట్టిగా వస్తాయని ఆలోచించి, చాలా మంది గాడిద పాల వ్యాపారం వైపు చూపుతున్నారు. ప్రస్తుతం, మార్కెట్‌లో గాడిద పాలకు వస్తున్న హైప్‌, రోజుకి రోజుకు పెరిగే డిమాండ్‌ను ఉపయోగించి, తమిళనాట ఓ ముఠా గాడిద పాల వ్యాపారం పేరుతో అమాయకులను వంచించింది. ఈ ఘటన.. ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.

తమిళనాడుకు చెందిన బాబు ఉలగనాథం, గిరి సుందర్‌, సోనికా రెడ్డి, బాలాజీ, డాక్టర్‌ రమేష్‌ కుమార్‌ అనే ఐదుగురు 2022లో ఒక ముఠా గా కలిసి “డాంకీ ప్యాలెస్‌” అనే సంస్థను ప్రారంభించారు. ఈ సంస్థ పేరుతో పెద్ద స్కామ్‌కు కారణమయ్యారు. వందలాది మంది రైతులను మోసగించారు. డాంకీ ప్యాలెస్‌ పేరుతో ఫ్రాంచైజీలు అని గాడిద పాలు లీటర్‌కు రూ.1600 అని లక్షల్లోనే ఆదాయం వస్తుందని నమ్మించి గాడిదలను రైతులకు అంటగట్టి ఏకంగా 100 కోట్ల రూపాయలతో జెండా ఎత్తేశారంటూ.. ఓ భారీ కుంభకోణం తెరపైకి వచ్చింది. ఇది కేవలం తెలంగాణలోనే కాదు  ఏపీ, తమిళనాడు, కర్నాటక, మహారాష్ట్ర లాంటి రాష్ట్రాల్లోనూ ఈ ముఠాకు రైతులు బకరాలయ్యారంటా.

హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో  తెలుగు రాష్ట్రాలకు చెందిన గాడిద పాల ఉత్పత్తిదారులు, ఔత్సాహిక యువకులు, మహిళలు గోడు వెల్లబోసుకున్నారు. చెన్నైలో డాంకీ ప్యాలెస్ ఫ్రాంచైజీ గ్రూపు సభ్యులు తమను నమ్మించి నిలువునా మోసం చేశారంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. గాడిద పాలకు భారీగా డిమాండ్ ఉందని సామాజిక మాధ్యమాల్లో జోరుగా ప్రచారం చేయడంతో.. అవి చూసి వారిని సంప్రదించామని బాధితులు చేప్తున్నారు.

Advertisement

ఈ డాంకీ ప్యాలెస్ పేరుతో ప్రాంచైజీ తరహాలో ఒక్కో పాడి గాడిదను రూ.80 వేల నుంచి 1.50 లక్షల రూపాయల చొప్పున రైతులకు అమ్మారు. అంతే కాదు సెక్యూరిటీ డిపాజిట్ కింద ఒక్కో రైతు నుంచి రూ.5 లక్షలు వసూలు చేశారు. గాడిదల నుంచి ఉత్పత్తి చేసిన పాలు లీటరు రూ.1600 చొప్పున తామే సేకరిస్తామని కూడా ఒప్పందం చేసుకున్నారని.. 3 నెలల పాటు నమ్మకం కలిగించేలా నగదు కూడా చెల్లించినట్టు చెప్పుకొచ్చారు. నాలుగో నెల నుండి, నిర్వహణ ఖర్చులు, షెడ్ నిర్మాణం, సిబ్బంది జీతాలు, వెటర్నరీ చికిత్స ఖర్చులు ఇచ్చే పని చేయకపోవడంతో, రైతులు అందరూ కలిసి ప్రశ్నించారు.

ఒక్కొక్కరికి రూ.15 లక్షల నుంచి రూ.70 లక్షల వరకు బ్యాంకు చెక్కులు రాసి చల్లగా పోయారు. అయితే, వాళ్లు ఇచ్చిన చెక్కులు బ్యాంకులో కూడా చెల్లాలి కదా. కానీ, ఆ చెక్కులు బ్యాంకులో తీసుకుంటే బౌన్స్ అయ్యాయి, అని అధికారులు తెలిపారు. అప్పటికే అసలు మోసం అర్థమయ్యింది. ఇలా తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో ఏకంగా 400 మందికి పైగా రైతులు బాధితులుండగా.. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే 100కు పైగా రైతులు.. ఇక్కడే రూ.100 కోట్ల దోపిడి జరిగినట్టు.. చెప్తున్నారు. ఇదొక పెద్ద కుంభకోణమని, దీని వెనుక రాజకీయంగా పెద్దల హస్తం ఉండవచ్చంటూ బాధిత రైతులు సంచలన ఆరోపణలు చేస్తున్నారు. ఇదే విషయంపై చెన్నైలో పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడానికి వెళ్తే పోలీసులు పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఒప్పందంలో ఇచ్చిన జీఎస్‌టీ సంఖ్య, ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ లైసెన్స్ కూడా నకిలీగా ఉన్నాయని తర్వాత తెలిసింది అని చెప్పారు.

ఒక్కో రైతు 30 నుంచి 50 గాడిదలను కొనుగోలు చేశారు. సుమారుగా రూ.30 లక్షల నుంచి 50 లక్షల వరకు పెట్టుబడులు పెట్టారు. కానీ, దాని మీద పైసా కూడా రాలేదు, ఇప్పుడు గాడిదల పోషణ భారం కూడా తమ మీదే పడిపోతున్నారని బాధితులు చెప్పుతున్నారు. అదికాక, ఫ్రాంచైజీ కోసం ఒక్కొక్కరికి రూ.5 లక్షలు తీసుకున్నారు, అలాగే గాడిదల పోషణ, పాలు పిట్టే గురించి క్లాసులు పెట్టి మరో రూ.50 వేలు తీసుకున్నారు అని బాధితులు చెబుతున్నారు. ఇప్పటికే పెద్ద మొత్తంలో అప్పులు, వడ్డీలు తలకు బరువైపోయాయి. కుటుంబ సభ్యుల వైద్యం, పిల్లల చదువుకు కూడా డబ్బులు లేవని, తక్షణమే తెలుగు రాష్ట్రాల సీఎంలు ప్రత్యేకంగా ముందుకు వచ్చి న్యాయం చేయాలని బాధితులు కోరారు. లేనిపక్షంలో ఆత్మహత్య చేయాల్సిన పరిస్థితి వస్తుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు.

Loading

Trending