Connect with us

Telangana

హైదరాబాద్‌లో తీవ్ర ఉద్రిక్తత..!మంద కృష్ణ మాదిగ అరెస్ట్..

ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ పూర్తి చేయకుండానే.. ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు చేపట్టటాన్ని వ్యతిరేకిస్తూ ఎమ్మార్పీఎస్పీ ఆధ్వర్యంలో రాష్ట్రమంతా నిరసనలు, ధర్నాలు నిర్వహించాలని పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే.. ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ.. శ్రేణులతో కలిసి తమ కార్యాలయం నుంచి ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వద్దకు బయలుదేరగా.. పోలీసులు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో ఉద్రిక్తత నెలకొనగా.. మందకృష్ణ మాదిగను పోలీసులు అరెస్ట్ చేశారు.

హైదరాబాద్‌లో ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగను పోలీసులు అరెస్ట్ చేశారు. ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ పూర్తి చేయకుండానే ప్రభుత్వ ఉద్యోగాలు ఎలా భర్తీ చేస్తారంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ.. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో భారీ ఎత్తున ర్యాలీలు, ధర్నాలు నిర్వహించాలని.. ఎమ్మార్పీఎస్ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే.. హైదరాబాద్ పార్శీగుట్టలో ఉన్న ఎమ్మార్పీఎస్ భవనం నుంచి ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వద్దకు.. శ్రేణులతో కలిసి బయలు దేరిన మందకృష్ణ మాదిగను పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు అడ్డుకున్నా సరే త‌మ ర్యాలీని కొన‌సాగిస్తామ‌ంటూ ఎమ్మార్పీఎస్ నాయ‌కులు స్పష్టం చేశారు.

ఈ నేపథ్యంలో ఎమ్మార్పీఎస్ నాయకులకు, పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది. ఈ పరిస్థితుల్లో మందకృష్ణ మాదిగను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం.. మందకృష్ణ మాదిగను గాంధీనగర్ పోలీస్ స్టేషన్‌కు తరలించగా.. ఎమ్మార్పీఎస్ శ్రేణులను నగరంలోనే వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు.

ఎస్సీ రిజ‌ర్వేష‌న్ వ‌ర్గీక‌ర‌ణ చేయ‌కుండానే  రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల‌ను ఎలా భ‌ర్తీ చేస్తార‌ని రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని మంద‌కృష్ణ మాదిగ‌ ప్రశ్నించారు. వ‌ర్గీక‌ర‌ణ చేయ‌కుండానే 11 వేల టీచ‌ర్ పోస్టులు భ‌ర్తీ చేస్తున్న నేప‌థ్యంలో తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎస్సీ వ‌ర్గీక‌ర‌ణ చేయ‌కుండానే ఎల్బీ స్టేడియంలో ఉపాధ్యాయ నియామ‌క ప‌త్రాలు ఇవ్వడంపై మందకృష్ణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.  సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును రాష్ట్ర ప్రభుత్వం ప‌ట్టించుకోకుండా ప్రభుత్వ ఉద్యోగ నియామ‌క ప్రక్రియ ఎలా చేప‌డతార‌ని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

తెలంగాణ రాష్ట్రంలో నూతనంగా చేపట్టే ఉద్యోగ నియామకాల్లో రిజర్వేషన్లు పాటించాలంటూ శాంతియుతంగా ర్యాలీ నిర్వహిస్తున్న ఎమ్మార్పీఎస్ నేతలను , కార్యకర్తలు ఉద్యమకారులను అరెస్టు చేయడం ఎంతవరకు సమంజసమని మందకృష్ణ ప్రశ్నించారు. మాదిగ‌ల‌కు అన్యాయం చేయ‌డానికే రేవంత్ రెడ్డి సర్కార్.. మాల‌ల‌తో కుమ్మక్కై మాదిగ‌ల‌ను మోసం చేస్తున్నార‌ని మందకృష్ణ మండిప‌డ్డారు.  ర్యాలీలు నిర్వహిస్తున్న వారిని అడ్డుకొని అరెస్ట్ చేయడం దారుణమంటూ మందకృష్ణ మాదిగ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఎస్సీ వ‌ర్గీక‌ర‌ణ అమ‌లు చేసే వ‌ర‌కు.. మాదిగ‌ల వాటా తేలే వ‌ర‌కు ఎలాంటి ప్రభుత్వ ఉద్యోగ నియామ‌కాలు జ‌ర‌పొద్దని మంద‌కృష్ణ మాదిగ‌ డిమాండ్ చేశారు

Advertisement

Loading

Continue Reading
Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending