Telangana
హైదరాబాద్: అక్రమ సంబంధం ఆరోపణలతో వదిన చేసిన నాటకంలో బలైన చెల్లి

హైదరాబాద్: అక్రమ సంబంధం ఆరోపణలతో వదిన చేసిన నాటకంలో బలైన చెల్లి
పెళ్లికి ముందు ఒక వ్యక్తితో పరిచయం ఉన్న ఆమె, పెళ్లి తర్వాత కొంతకాలం అతనికి దూరంగా ఉండింది. మళ్లీ ఇరువురి మధ్య వివాహేతర సంబంధం మొదలైంది. తాను ప్రియుడితో తిరుగుతున్న విషయం ఆడపడుచు కంటబడింది. అంతే, ఆమె తన గుట్టురట్టు చేస్తుందని భావించిన వదిన.. డ్రామాకు తెరతీసింది. పక్కింటిలో ఉండే యువకుడితో ఆడపడుచుకి సంబంధం అంటగట్టింది. ప్రియుడితో కూడా ఆమెకు మెసేజ్లు పంపుతూ వేధింపులకు గురిచేసి.. చివరకు ప్రాణాలు తీసుకునేందుకు కారణమైంది.
తన వివాహేతర సంబంధం గురించి ఆడపడుచుకు తెలియడంతో.. అది ఎక్కడ బయటపెట్టేస్తుందోనని ఆమెపైనే నిందలు వేసింది. తన ఇంటి పక్కనే ఉన్న యువకుడితో ఆమెను అక్రమ సంబంధం పెట్టుకుందని అభియోగం పెట్టింది. ఆమె ఎంతగా “నిజం కాదు” అని చెప్పినా, ఆమెను బలవంతంగా బయటకు తీసుకువచ్చింది. అంతటితో ఆగకుండా తన ప్రియుడి సహాయంతో ఆమెకు మొబైల్కు మెసేజ్లు పంపుతూ వేధించింది. వదిన ఆడిన నాటకంలో యువతి బలిపశువైంది. చివరకు వేధింపులతో ఆత్మహత్యకు పాల్పడింది. బేగంపేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ నెల 11న ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న డిగ్రీ విద్యార్థిని స్రవంతి కేసులో నిజం బయటపడింది.
అన్న భార్య శైలజ వేధింపుల వల్లే స్రవంతి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు నిర్ధారించారు. ఈ కేసులో శైలజతో పాటు ఆమె ప్రియుడు నవీన్ను కూడా అరెస్ట్ చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. రసూల్పురా ఇందిరమ్మనగర్కు చెందిన విఠల్ కుమార్తె స్రవంతి (19) నవంబరు 11 ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు చేసుకుంది. స్రవంతి పక్కింటి యువకుడు వేధించడం వల్లనే ఆమె ఆత్మహత్య చేసుకుందని స్రవంతి తల్లిదండ్రులు పోలీసులకు తెలిపారు. దీంతో నమోదుచేసిన పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో స్రవంతి సెల్ఫోన్ను పరిశీలించారు. ఆమెకు మెసేజ్లు వచ్చిన ఫోన్ నెంబరు.. పక్కంటి యువకుడుది కాదని వెల్లడయ్యింది.
ఆ నెంబర్ యూసుఫ్గూడ రహమత్నగర్లో నివసించే నవీన్కుమార్ది అని గుర్తించారు. అతడ్ని అదుపులోకి తీసుకుని విచారించడంతో అసలు నిజం వెలుగులోకి వచ్చింది. స్రవంతి వదిన శైలజ మరియు నవీన్కు ముందే సంబంధం ఉన్నట్లు కనుక్కొనబడ్డది. పెళ్లి తర్వాత కొంతకాలం దూరంగా ఉన్నవారు, ఇటీవల మళ్ళీ కలవడం మొదలెట్టారు. ఈ విషయాన్ని స్రవంతి గుర్తించడంతో తమ సంబంధం ఎక్కడ బయటపడుతుందోనని శైలజ భావించింది. దీంతో ఆడపడుచుపైనే అబాండాలు వేసింది. ఇంటి పక్కన ఉండే ఒక యువకుడితో సంబంధం ఉందని ఆమె తనకు వేధింపులు చేసింది.
అతడు తనకు సోదరుడి లాంటివాడని చెప్పినా వినిపించుకోకుండా భర్త, అత్తమామలకు నూరిపోసింది. ఆమె మోసం గురించి తెలియని వారు కూడా స్రవంతిని అనుమానించడానికి ప్రారంభించారు. ఆమె ప్రియుడు నవీన్ను ఉపయోగించి, అతడి ద్వారా స్రవంతికి మెసేజ్లు పంపాలని శైలజ ప్లాన్ చేసుకుంది. శైలజ, నవీన్ల వేధింపులను తట్టుకోలేక స్రవంతి ఆత్మహత్య చేసుకుంది. చివరకు కోడలే తమ కుమార్తె చావుకు కారణమని పోలీసులు కనుగొన్నప్పుడు, స్రవంతి తల్లిదండ్రులు షాక్ అయ్యారు. శైలజతో పాటు నవీన్కుమార్ను గురువారం పోలీసులు అరెస్టు చేశారు.
-
Devotional8 months ago
ఖైరతాబాద్ మహా గణపతి: 70 ఏళ్లు.. 70 అడుగులు
-
Entertainment8 months ago
శేఖర్ బాష మరియు మణికంట మధ్యలో మాటల యుద్ధం | Bigboss |Telugu Biggboss Season8 | Day 4 | Nagarjuna
-
Devotional8 months ago
Lalbaugcha Raja: 10 రోజుల్లోనే గణేషుడికి కోట్ల సంపద..
-
Politics7 months ago
విజయ్పై డీఎంకే, అన్నాడీఎంకే సంచలన వ్యాఖ్యలు ఆయన కాపీరాయుడు